బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదని రాజాసింగ్ ఆవేశంగా రాజీనామా చేశారు. నామినేషన్ వేసేందుకు వెళ్తే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. అందుకే కోపం వచ్చి అక్కడికక్కడ రాజీనామా ప్రకటించేశారు. అయితే బీజేపీలో అసంతృప్త జ్వాల అని మీడియా ఎంత ప్రసారం చేసినా అక్కడ అంత సీన్ లేదు. ఆయన గురించి అందరికీ తెలిసిందే కాబట్టి బీజేపీ నేతలు కూడా పట్టించుకోలేదు.
రాజాసింగ్ కల్ట్ హిందూత్వ వాది. ఆయనను ఏ పార్టీ కూడా చేర్చుకోదు. బీజేపీ కూడా మా పార్టీ నేతేనని ధైర్యంగా చెప్పుకోలేదు. ఆయనను భరించలేక చాలా రోజులు సస్పెన్షన్ లో ఉంచింది. పధ్నాలుగు నెలల పాటు సస్పెండ్ చేసి ఎన్నికలకు ముందు అతి కష్టం మీద సస్పెన్షన్ ఎత్తి వేసి సీటు ఇచ్చారు. గోషామహల్ నియోజకవర్గంలో ఆయన తప్ప ఎవరూ గెలిచే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ అవకాశం కల్పించింది.
ఆయనను ఇతర పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా భాగం చేయరు. కానీ తనకు అధ్యక్ష పదవి కాాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తనకు మద్దతివ్వడం లేదని.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారిపై ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆయన పేరును హైకమాండ్ కూడా పరిగణన తీసుకోవడం లేదు. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసినట్లుగా ఆయన ప్రకటించారు కానీ.. రేపోమాపో మళ్లీ ఆయన తాను బీజేపీలోనే ఉంటానని ప్రకటించుకుంటారు. అందుకే తెలంగాణ బీజేపీ నేతలెవరూ పట్టించుకోవడం లేదు.