గ్రేట్ : విక్ర‌మ్ సినిమాకి లాభాలు

ఈ రోజుల్లో ఓ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ రావ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అందునా డ‌బ్బింగ్‌సినిమాకి. అందులోనూ వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న హీరోకి. ఆ ఘ‌న‌త సాధించిన సినిమా ఇంకొక్క‌డు. విక్ర‌మ్ న‌టించిన సినిమా ఇది. న‌య‌న‌తార‌, నిత్య‌మీన‌న్ క‌థానాయిక‌లు. విక్ర‌మ్ వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న హీరో. అప‌రిచితుడు త‌ర‌వాత అస‌లు హిట్ట‌నేదే తెలియ‌కుండా పోయింది. ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్న శంక‌ర్ చిత్రం ఐకూడా డిజాస్ట‌ర్ జాబితాలో చేరింది.

త‌మిళ్‌లో విక్ర‌మ్ న‌టించిన ఇరుమురుగ‌న్‌.. ఇప్పుడు ఇంకొక్క‌డు పేరుతో తెలుగులోకి వ‌స్తోంది. ఈ సినిమా డ‌బ్బింగ్ నిర్మాత‌లకు టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్ట‌డం విశేషం. డ‌బ్బింగ్ రైట్స్‌ని రూ.5 కోట్ల‌కు చేజిక్కించుకొన్నారు నిర్మాత‌లు. వాళ్ల నుంచి అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ రూ.8 కోట్ల‌కు రైట్స్ కొనుగోలు చేసింది. అంటే.. ఇప్ప‌టికే మూడు కోట్ల లాభం వ‌చ్చింద‌న్న‌మాట‌. శాటిలైట్ ఎంత‌కాద‌న్నా కోటి ప‌లుకుతుంది. మొత్తానికి నాలుగు కోట్ల లాభాన్ని ద‌క్కించుకొన్న‌ట్టు.

ఓ డ‌బ్బింగ్ సినిమాకి ఈ రేంజులో లాభాలు రావ‌డం మామూలు విష‌యం కాదు. ఇటీవ‌ల కొన్ని డ‌బ్బింగ్ సినిమాలు తెలుగునాట మంచి వ‌సూళ్ల‌నే అందుకొంటున్నాయి. బిచ్చ‌గాడు సినిమా రూ.20 కోట్లు కొల్ల‌గొట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. విక్ర‌మ్ సినిమాలకు తెలుగులో ఇంకా క్రేజ్ త‌గ్గ‌లేదు. దానికి తోడు న‌య‌న‌తార‌, నిత్య‌మేన‌న్‌ల ఇమేజ్ కూడా ఈ సినిమాకి క‌లిసొచ్చే విష‌య‌మే. బీసీల్లో నిల‌దొక్కుకోగ‌లిగితే రూ.8 కోట్లు రాబ‌ట్టుకోవ‌డం అంత క‌ష్ట‌మేం కాదు. అందుకే. ఇంకొక్క‌డ‌కు కోట్లు కురిశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close