జనతా గ్యారేజ్……ఎన్టీఆర్‌కి చాలా పెద్ద సమస్యనే తెచ్చిపెట్టిందిగా

జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటి? కెరీర్‌లో ఎప్పుడూ కూడా ఒక సినిమా పూర్తయ్యేలోపే తర్వాత సినిమాను లైన్‌లో పెట్టే ఎన్టీఆర్… ఈ సారి ఎందుకు గ్యాప్ తీసుకుంటున్నాడు? దానికి ప్రధాన కారణం జనతా గ్యారేజ్ సినిమా కలెక్షన్సే అని తెలుస్తోంది. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించి పెట్టిన ‘జనతా గ్యారేజ్’ కంటే ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొట్టే సినిమానే చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయి ఉన్నాడు. కానీ సరైన డైరెక్టర్ ఎవ్వరూ ఎన్టీఆర్‌కి అందుబాటులో లేరు. తనకు బాగా ఇష్టమైన రాజమౌళి, వినాయక్, సుకుమార్ లాంటి వాళ్ళు… వాళ్ళ సినిమాలతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా బిజీ. లింగుస్వామి కూడా బన్నీతో ఫిక్స్ అయిపోయాడు. ఇక ఎన్టీఆర్‌కి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ పూరీ జగన్నాథ్. అలాగే పూరీకి కూడా ఇప్పటికిప్పుడు డేట్స్ ఇచ్చే స్టార్ హీరో ఎవ్వరూ లేరు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌తో చేస్తున్న ఇజం సినిమాను పూర్తి చేసేశాడు పూరీ. పూరీ జగన్నాథ్ చెప్పిన లైన్ కూడా ఎన్టీఆర్‌కి నచ్చిందని చెప్తున్నారు. మరి సమస్య ఏంటి?

ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వరుస ఫ్లాప్స్‌తో, కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత డౌన్‌లో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ‘టెంపర్‌’లాంటి మంచి హిట్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. ఎన్టీఆర్ ఇమేజ్‌ని కూడా మార్చగలిగాడు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆ సక్సెస్ క్రెడిట్‌ని ఎక్కువ శాతం వక్కంతం వంశీ అకౌంట్‌లో వేస్తున్నాడు. ఒక్క టెంపర్ సినిమాను పక్కన పెడితే పూరీ జగన్నాథ్ తీసిన లాస్ట్ హిట్ సినిమా ఏది అంటే ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. అందుకే పూరీ జగన్నాథ్ చెప్తున్న కథలను నమ్మే పరిస్థితులలో లేడు ఎన్టీఆర్. అలాగని వక్కంతం వంశీని కథ ఇవ్వమంటే… ఆయనేమో డైరెక్షన్ కూడా కావాలంటున్నాడు. ఇప్పుడున్న స్టేజ్‌లో ఓ కొత్త డైరెక్టర్‌తో సినిమా అంటే ప్రి రిలీజ్ బిజినెస్ రేంజ్ పడిపోతుంది. ఆ తర్వాత సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా కూడా ‘జనతా గ్యారేజ్’ కలెక్షన్స్ క్రెడిట్ మొత్తాన్ని కొరటాల శివ అకౌంట్‌లో వేసేస్తారు క్రిటిక్స్. పైగా ఇప్పుడు ఎన్టీఆర్‌ని విమర్శించడానికి పనిగట్టుకుని కూర్చున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అని పూరీ జగన్నాథ్ సొంత కథ అంటే కూడా డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్‌ ఎవ్వరూ కూడా క్రేజీ అమౌంట్స్‌తో ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఎన్టీఆర్ చాలా పెద్ద కన్ఫ్యూషన్‌లో ఉన్నాడని తెలుస్తోంది. బ్యాంకాక్ వెళ్ళి కొన్ని రోజుల పాటు రెడీ చేసి, తీసుకొచ్చి వినిపించిన పూరీ వంటకం కూడా ఎన్టీఆర్ అండ్ టీంకి అంతగా నచ్చలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ తీసుకోబోయే నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close