ఆ ‘న‌ల్ల కుబేరుడి’పై కొత్త ప్ర‌చారం!

ప‌దివేల కోట్ల న‌ల్ల‌ధ‌నం ప్ర‌క‌టించిన ఆ బ్లాక్ మిలియ‌నీర్ ఎవ‌ర‌నేది ఆంధ్రాలో అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య తీవ్ర చ‌ర్చ‌కు దారితీసిన సంగ‌తి తెలిసిందే. అది ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి చెందిన‌ సొమ్మే.. అని తెలుగుదేశం ఒక స్టాంప్ వేసేసింది. ఆ కుబేరుడు ఆయ‌నే అంటూ విమర్శ‌లు చేసింది. ప్ర‌తిప‌క్షం వైకాపా కూడా త‌గ్గ‌లేదు. ఆ బ్లాక్ మ‌నీ చంద్ర‌బాబు అనుచ‌రుడిది అంటూ జ‌గ‌న్ మ‌రో కొత్త వాద‌న తెర‌మీదికి తెచ్చారు. ఆ న‌ల్ల‌ధ‌న‌వంతుల వివ‌రాలు బ‌య‌ట‌పెట్టాల‌ని కూడా ప్ర‌ధానికి లేఖ రాశారు. అంతేకాదు, త్వ‌ర‌లోనే ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాన‌మంత్రిని స్వయంగా క‌లిసి ఇదే విష‌య‌మై మాట్లాడేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. అయితే, ఈ త‌రుణంలో ఆ న‌ల్ల‌ధ‌న కుబేరుడు ఎవ‌రంటూ అన్ని వ‌ర్గాల్లోనూ కొత్త చ‌ర్చ మొద‌లైంది.

అంత మొత్తంలో బ్లాక్‌ను వైట్ చేసుకున్న‌ది ఆదికేశ‌వుల నాయుడే అనే అనుమానాలు ఇప్పుడు కొత్త‌గా ప్ర‌చారంలోకి వ‌స్తున్నాయి. ఆ సొమ్ము ఆయ‌న‌దే అయి ఉంటుంద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఇటీవ‌లే ఆయ‌న భార్య, చిత్తూరు శాస‌న స‌భ స‌భ్యురాలు స‌త్య‌ప్ర‌భ ఇంటిపై ఐటీ దాడులు జ‌రిగాయి. లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాతో ఈ ఫ్యామిలీకి సాన్నిహిత్యం ఉంద‌నీ, ఆయ‌న స్వ‌దేశీ బ్యాంకుల‌కు రూ. 9 వేల కోట్ల కుచ్చుటోపీ పెట్టి దేశాన్ని దాటేస్తున్న సంద‌ర్భంగా ఈ ఫ్యామిలీ ద‌గ్గ‌ర కొంత సొమ్ము దాచుకున్నార‌ని అనుమానించారు. ఆ కోణంలో ఐటీ దాడుల జ‌రిగాయ‌నీ, పెద్ద ఎత్తున ఆస్తులు దొరికాయ‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు, ఈ ఫ్యామిలీ న‌డుపుతున్న కాలేజీలో కూడా పెద్ద మొత్తంలో బ్లాక్ మ‌నీ ల‌భించింద‌నీ అన్నారు. కాబ‌ట్టి, ఆంధ్రాలో హాట్ టాపిక్‌గా మారిన ఆ న‌ల్ల‌ధ‌న‌వంతుడు ఆదికేశ‌వుల నాయుడే అయి ఉంటార‌ని వాణిజ్య వ‌ర్గాల్లో కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఒక‌వేళ ఇదే క‌రెక్ట్ అయితే ఈ విష‌యంలో తెలుగుదేశం సెల్ఫ్ చేసుకున్న‌ట్టు అవుతుంది. ఇన్నాళ్లూ ఆ న‌ల్ల‌ధ‌న‌వంతుడు జ‌గ‌నే అంటూ దేశం వెలెత్తి చూపింది. ఇప్పుడు, అది తెలుగుదేశం పార్టీకి చెందిన‌వారిదే అనే ప్ర‌చారం మొద‌లైంది. ఈ తాజా ప్ర‌చారాన్ని వైకాపా ఆయుధంగా మార్చుకునే అవ‌కాశం ఉంటుంది. ఏదేమైనా, ఈ బ్లాక్ మ‌నీ గొడ‌వ ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేట్టుగా లేదు. కొత్త‌కొత్త పేర్లు తెర‌మీదికి వ‌స్తున్నాయి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close