మోడీ వ్యూహాత్మక ఎదురు దాడి

బీహార్లో తాడో పేడో తేల్చుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు. ఢిల్లీ ఫలితం పునరావృతం కాకుండా చూడటానిని పత్రయపడుతున్నారు. మంగళవారం భాగల్పూర్ సభలో ఆయన చేసిన ప్రసంగం, ఈ విషయం స్పష్టం చేస్తోంది. మొన్న పాట్నా స్వాభిమాన్ ర్యాలీలో లాలు, నితీష్, సోనియా గాంధీలు మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. దీనికి మోడీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

తాను లోక్ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రోగ్రెస్ రిపోర్ట్ అడగటానికి ఇవి లోక్ సభ ఎన్నికలు కాదు అసెంబ్లీ ఎన్నికలని గుర్తు చేశారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన పనితీరు గురించి ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని చెప్పారు. తద్వారా, ఎన్నికల ప్రచారంలో కేంద్రం గురించి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించే చర్చ జరగాలన్న ఎజెండాను ఫిక్స్ చేశారు. 2015లో ప్రతి ఊరికీ విద్యుత్ సరఫరా చేయకపోతే ఓటు అడగనని అప్పట్లో నితీష్ కుమార్ శపథం చేశారు. ఇప్పుడు దాని గురించే మోడీ ప్రశ్నిస్తున్నారు. అన్న మాట ప్రకారం ప్రతి ఊరికీ కరెంటు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పటికీ బీహార్ లో చాలా గ్రామాలకు కరెంటు సరఫరా జరగడం లేదు. అలాంటప్పుడు నితీష్ ఓటు ఎలా అడుగుతారని నిలదీయండి అంటూ బీహార్ ప్రజలకు పిలుపునిచ్చారు.

బీహార్లో ఇప్పటికీ చాలా గ్రామాలకు సరైన రోడ్లు లేవు. ఇతర మౌలిక సదుపాయాలు లేవు. నిరుద్యోగం పెరుగుతోంది. ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. పాతికేళ్లుగా లాలు, నితీష్ జమానాలో బీహార్ ను ఏం ఉద్ధరించారని మోడీ ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలను ఆలోచింపచేయడానికి ప్రయత్నించారు. ప్రత్యర్థులపై ఊరికే విమర్శలు చేయడం కాకుండా ఇలా పాయింట్ల వారీగా ఎదురు దాడి చేయడం కొత్త వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి ప్రత్యర్థులను డిఫెన్స్ లోకి నెట్టడానికి మోడీ ప్రయత్నించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close