400 కోట్ల కోసమే అమరావతి ఎంపిక

తము కొన్న భూమిపై కోట్లలో లాభాలు సంపాదించడం కోసమే ఒక రాష్ట్ర మంత్రి, మరో కేంద్ర మంత్రి పట్టుపట్టి రాజధానిని అమరావతికి తరలించారని తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ ప్రజా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. రాజధాని డిజైన్ల పేరిట హడావుడి జరుగుతున్నప్పుడు ఆయన ఈ మాటలనడం విశేషం. విజయవాడ చుట్టుపక్కల వందల ఎకరాల భూమి అందుబాటులో వుందేది. ఇప్పటికే ప్రసిద్ధికెక్కిన పట్టణాలను నగరాలను ఆధారం చేసుకుని రాజధానిని కట్టుకుని వుంటే ఎప్పుడో పూర్తయ్యేది. కాని అమరావతి అంటూ బయిలు దేరారు. అక్కడ ఎ టు జెడ్‌ సమకూర్చుకోవలసిందే కదా.. అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. మాకే కాదు ముఖ్యమంత్రికీ తెలియదు. చెరో రెండు వందల ఎకరాలు ముందుగానే తీసుకున్న ఆ కేంద్ర మంత్రి, ఆ రాష్ట్ర మంత్రి మాత్రమే దీనివల్ల లాభపడాలనుకున్నారు. ఎకరాకు కోటి లాభం వస్తుందనుకుందాం. దానికోసం ఇంత కక్కుర్తి పడాలా అని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు. నిజంగా అక్కడ అభివృద్ధి జరిగి అందరూ సంతోషించాలంటే ఎంత కాలం పడుతుందో ఎవరికీ తెలియదని ఏదో విధంగా మురిపించడం కోసం ఇప్పుడు ఎక్కువ కష్టపడాల్సి వస్తున్నదని ముఖ్యమంత్రికి దగ్గరగా మెలిగే ఆ నేత వాపోయారు. నారాయణకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలో ఇస్తున్నారో ఒక్కరికైనా అర్థం కాదని వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరు చెప్పిన మాటలు నమ్మిన చంద్రబాబు కూడా అనేక విధాల ప్రయోజనం కలుగుతుందనే ఆశతో భూ సమీకరణ వంటివన్నీ పూర్తిచేసి అమరావతిలోచిక్కుకుపోయారని, ఎన్నికలలోగా ఏదో జరిగినట్టు చూపించడం ఏమంత తేలిక కాదని స్పష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close