ముందస్తుపై లోకేశ్‌ వివరణలో ఆంతర్యం?

ముందస్తుగా ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్పలేదని మంత్రి,తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వివరణ లేక ఖండనో ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ వార్త మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. అనుకూల ముద్ర వున్న వాటిలోనూ వివరంగా వచ్చింది. తదుపరి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోనూ ఇదే విధమైన వాతావరణం కొనసాగింది. ఎన్నోవిషయాలపై మాట్లాడిన చంద్రబాబు దీన్ని మాత్రం ఖండించలేదు. పైగా 2018 మార్చిలో ఎన్నికలు వుంటాయని ముఖ్యమంత్రి స్పష్గంగానే చెప్పారని తెలుగుదేశం ప్రతినిధులు మాలాటి వారితో అన్నారు కూడా. బుధవారం ఉదయం కూడా ఒక నాయకుడు చెప్పారు. మరి అంతా అయ్యాక ద్వితీయ నేతగా వున్న లోకేశ్‌ నుంచి ఈ మాట వచ్చిందంటే వ్యూహాత్మక ప్రకటనా? లేక పునరంచనా ఫలితమా? కాదంటే ఎందుకైనా మంచిదని అంటున్నారా? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా వుండాలని మాత్రమే చంద్రబాబు అన్నారని లోకేశ్‌ మరో మాట అంటున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే ఇది జాగ్రత్త కోసం గాని లేకపోతే బిజెపితో బేరసారాలలో బెట్టు కోసం గాని చేసిన ప్రకటనే అనుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ఎన్నికలంటే ఏ పార్టీ ఒప్పుకోదని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ వారం రోజులలోనూ తెలుగుదేశం ప్రతినిధులందరూ ఇంచుమించు బలపరుస్తూనే మాట్లాడారు. మరి వారికి సరైన సమాచారం ఇవ్వలేదా? కాదంటే ఇచ్చింది మార్చుకున్నారా? ఇదే తుదిమాటా లేక రేపు మరో విధంగా మాట్లాడ్డం ద్వారా ప్రతిపక్షాలను గజిబిజికి గురి చేస్తారా? చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close