పచ్చి అబద్ధాలు చెబుతున్న రాంచరణ్

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కంచె చిత్రం ఆడియో వినాయకచవితి రోజున హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఆడియోను విడుదల చేసిన రాం చరణ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఏ స్టార్ డైరెక్టర్‌నూ తాను సినిమా చేయమని అడగలేదని, క్రిష్‌ను మాత్రమే ఐదేళ్ళనుంచి కథ చెప్పమని అడుగుతూ వస్తున్నానని చెప్పారు. అయితే ఇది పచ్చి అబద్ధం. ప్రముఖ తమిళ దర్శకులు మురుగదాస్‌ను, గౌతమ్ మీనన్‌ను తనతో చేయాలని సభాముఖంగా చరణ్ ఇంతకుముందు అడగటం సినిమా కార్యక్రమాలను క్లోజ్‌గా ఫాలో అయ్యేవారందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే చరణ్ మాత్రం ఈ విషయాన్ని మరిచిపోయినట్లుంది. ఆయనేమైనా గజనీగా మారిపోయారా లేకపోతే ఆయన ఉద్దేశ్యం తెలుగులో స్టార్ డైరెక్టర్‌లను అడగలేదనా అనేది తెలియటంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close