‘విజ్‌క్రాఫ్ట్‌’కు అమరావతి ఈవెంట్ – రాజుకున్న వివాదం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఈవెంట్‌ను ముంబాయికి చెందిన ‘విజ్‌క్రాఫ్ట్’ సంస్థకు ఇచ్చారన్న వార్తలపై వివాదం రాజుకుంది. తుళ్ళూరు మండలం వెంకటపాలెం సమీపంలో సుమారు 50 ఎకరాల స్థలంలో రానున్న విజయదశమికి జరగనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. దేశప్రధాని నరేంద్రమోడితోబాటు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమ నిర్వహణను అంతర్జాతీయస్థాయిలో నిర్వహించాలని, నిర్వహణను ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఈనెల 16న సీఆర్‌డీఏ సంస్థ ఈ-టెండర్‌లు ఆహ్వానించింది. ఈ ఈవెంట్‌ను రు.9.5 కోట్లకు విజ్‌క్రాఫ్ట్ సంస్థ దక్కించకుందని ఇవాళ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో ఓ కథనం వచ్చింది. ఆ సంస్థకు టెండర్ ఇవ్వటం ఏకపక్షంగా సాగిందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పురపాలకశాఖమంత్రి నారాయణ ఇవాళ మధ్యాహ్నం దీనిపై ఒక వివరణ ఇచ్చారు. ఇంతవరకు ఏ సంస్థకూ ఆ బాధ్యతలు అప్పగించలేదని విజ్‌క్రాఫ్ట్ పేరు పరిశీలనలోమాత్రమే ఉందని మీడియాతో చెప్పారు. అయితే ఈ మొత్తం వ్యవహారం పారదర్శకంగా జరగటంలేదన్నదిమాత్రం వాస్తవం. వ్యవహారం మొత్తం పారదర్శకంగా నడపటంకోసమే ఈ-టెండర్‌లను పిలుస్తారు. కానీ ఇక్కడ అంతా తిరకాసుగానే కనిపిస్తోంది. దానికితోడు దీనిపై తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే దినపత్రికలో కథనంరావటం మరింత విచిత్రంగా ఉంది. ఒకవేళ ఆ పత్రికకు చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వకపోవటంవల్ల ఈ కథనం వెలువడిందా అన్న వాదనకూడా వినబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close