జగన్ బాయ్‌కాట్ నిర్ణయంపై వైసీపీ కార్యకర్తల అసంతృప్తి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవకూడదని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆయన సొంతపార్టీలోని కోస్తాప్రాంత కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. రాజధాని అనేది అందరిదీ అని, ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవటంవలన వైసీపీ పార్టీ ప్రజలకు దూరమైపోతుందని వారు భావిస్తున్నారు. అసలు విజయవాడ-గుంటూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి జగన్ వ్యతిరేకించటం వలనే ఇటీవల జగన్ దీక్షకు మద్దతు పెద్దగా లభించలేదని, ఇప్పుడు ఈ బాయ్‌కాట్ నిర్ణయం వలన వ్యతిరేకత పెరుగుతుందని వారు వాదిస్తున్నారు. జగన్‌ను కలిసి నిర్ణయాన్ని మార్చుకోమని అడుగుదామని కొందరు భావిస్తున్నారు.

నూతన రాజధానిని కృష్ణా-గుంటూరు జిల్లాల ప్రాంతంలో నిర్మించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని బలంగా వ్యతిరేకించలేదని రాయలసీమలోని వైసీపీ శ్రేణులలో జగన్‌పై ఇప్పటికే అసంతృప్తి బలంగా ఉంది. ఆ కారణంగానే జగన్ ఇటీవల గుంటూరులో చేసిన దీక్షకు రాయలసీమలో స్పందన కొరవడింది. ఇటు కోస్తాలోనేమో బాయ్‌కాట్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తమవటం… మొత్తం మీద చూస్తే వైసీపీలో రెండుప్రాంతాలలోనూ అసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి జగన్ దీనిని ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close