శంకుస్థాపన సభలో కేసీఆర్ ఏంమాట్లాడతారు?

ఆంధ్రులను, ఆంధ్రాపాలకులను నిన్నటి వరకు తిట్టిపోసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అమరావతి శంకుస్థాపన సభలో మాట్లాడబోతున్నట్లు తెలియగానే రెండుతెలుగు రాష్ట్రాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొన్నీమధ్యనే స్వయంగా కేసీఆర్ ఇంటికివెళ్ళి ఆయన్ని అమరావతి శంకుస్థాపనకు సాదరంగా ఆహ్వానించడం, కేసీఆర్ అందుకు వెంటనే ఆమోదం తెలపడాన్ని చాలామంది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా వీరిద్దరు చాలాసేపు అనేక విషయాలపై సానుకూలంగా మాట్లాడుకోవడం మరో ఆశ్చర్యకరమైన పరిణామం. ఒకరు ఉప్పు, మరొకరు నిప్పులా ఉండే ఇద్దరు చంద్రులు ఇలా చల్లటి వెలుగులు ప్రసరింపజేయడం శుభకరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు.

శంకుస్థాపన కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ వస్తున్నట్లు అధికారికంగా కబురు వచ్చినప్పటికీ , ప్రస్తుతం పంజాబ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆయన తన పర్యటనను రద్దుచేసుకున్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా హెలికాప్టర్ లో అమరావతికి వెళతారు. శంకుస్థాపన కార్యక్రమం అయ్యాక సభలో ఆయన ప్రసంగిస్తారు. ముందుగా అనుకున్న ప్రసంగీకుల లిస్ట్ లో కేసీఆర్ పేరులేకపోయినా తదుపరి ఆయన పేరు చేర్చారు. ఈ మార్పుకు ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం తెలియజేసింది. కాగా, రేపు ప్రధాని నరేంద్రమోదీ హిందీలో చేసే ప్రసంగాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలుగులో అనువదించనున్నారు.

రెండు తెలుగురాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు `చంద్రుల’ మధ్య సఖ్యత ఉండాలని అటు ప్రధాని మోదీ, ఇటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభిలషిస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న నరసింహన్ కూడా వీరిద్దరి మధ్య సఖ్యత తీసుకురావడం కోసం గతంలో కొన్ని ప్రయత్నాలు చేశారు. రేపటి సభతో వీరిద్దరి మధ్య అనుబంధం గట్టిపడితే అది తెలుగురాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని అనుకుంటున్నారు. అందుకే, కేసీఆర్ ప్రసంగం పట్ల పలువురు ఆసక్తికనబరుస్తున్నారు. కేసీఆర్ కూడా ఈ సభలో ఫ్రీటంగ్ తో మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close