‘మారుతి’ని చావుదెబ్బ కొడుతున్న బుల్లికారు ‘క్విడ్’!

హైదరాబాద్: దశాబ్దాలుగా భారత్‌లో కార్ల అమ్మకాలలో నంబర్ 1 స్థానంలో ఉన్న మారుతిసంస్థను రెండు నెలలైనా నిండని పసిగుడ్డులాంటి ఒక బుల్లికారు దిమ్మతిరిగిపోయేలా దెబ్బకొడుతోంది. భారత చిన్నకార్ల మార్కెట్‌లో మారుతి రారాజన్న విషయం తెలిసిందే. వారి మారుతి 800, ఆల్టో 800, ఆల్టో కే10 కార్లు ఎన్ని విదేశీ బ్రాండ్‌లొచ్చినా అప్రతిహతంగా ముందంజలో కొనసాగుతున్నాయి. అలాంటి మారుతికి ఫ్రెంచ్ కంపెనీ ‘రెనో’ షాక్ ఇచ్చింది. గత నెలలో లాంచ్ అయిన రెనో క్విడ్ మొదటిరోజునుంచే సూపర్ సక్సెస్ అయింది.

ఫ్రెంచ్ కంపెనీ రెనో, జపాన్ కంపెనీ నిస్సాన్ కలిసి క్విడ్‌ను మూడేళ్ళు కష్టపడి డిజైన్ చేశాయి. ఇది ఒక బుల్లి ఎస్‌యూవీ లాగా కనిపించే హేచ్‌బ్యాక్. ముందునుంచి చూస్తే రెనో వారి సక్సెస్‌ఫుల్ మోడల్ డస్టర్‌లాగా ఉంటుంది. 800 సీసీ పెట్రోల్ ఇంజన్‌తో రూపొందించిన ఈ కారును కేవలం ఇండియన్ మార్కెట్ కోసమే తయారు చేశారు. ప్రత్యర్థి కంపెనీలకంటే సరసమైన ధరకే అందించాలనే ఉద్దేశ్యంతో ఎంట్రీ మోడల్ రేటును రు.2.56 లక్షలుగా నిర్ణయించారు. లోపలి ఫీచర్స్ అన్నీ హైఎండ్ కార్‌లలో ఉండేవి అందించారు. లోపలి స్పేస్ మిగిలిన చిన్న కార్లన్నింటికంటే ఎక్కువ ఉండటం దీని మరో ప్రత్యేకత.

ఇన్ని ప్రత్యేకతలుండటంవలనే క్విడ్ మొదటిరోజునుంచే విజయవంతమైపోయింది. మొదటి రెండువారాలలోనే దేశవ్యాప్తంగా 25,000 బుకింగ్‌లు జరిగాయి. నెలరోజుల తర్వాత చూస్తే, ఇప్పుడు ఆరునెలల వెయిటింగ్ పీరియడ్ ఏర్పడింది. క్విడ్ మారుతి ఆల్టో, హ్యూండాయ్ ఇయాన్ మోడల్స్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఆదరణతో ఉత్సాహంలో ఉన్న క్విడ్ తయారీదారులు 1 లీటర్ పెట్రోల్, ఆటోమేటిక్ వంటి మరిన్ని వేరియంట్స్‌ను తీసుకురావాలనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close