బీహార్ లో అసదుద్దీన్ అరెస్ట్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ఎఐఎంఐఎం (మజ్లీస్) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ షరా మామూలుగానే ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడంతో పూర్ణియా జిల్లాలో బైసాయి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అంతకు ముందు ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రసంగాలు చేసినందుకు పోలీసులు అతనిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేసారు. ఆయన సంగతి ఏమయిందో గానీ బీహార్ వెళ్లి అన్నగారు బుక్ అయిపోయారు. ఎంఐఎం పార్టీ మొట్ట మొదటిసారిగా ఈ ఎన్నికల ద్వారా బీహార్ లో అడుగుపెడుతోంది. సీమాంచల్ ప్రాంతంలో కిషన్ గంజ్, రాణి గంజ్, బైసి, అమౌర్, బలరాంపూర్ ఆరు నియోజకవర్గాల నుండి పోటీ చేస్తోంది. అసదుద్దీన్ అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఎంఐఎం కార్యకర్తలు ధర్నా చేసారు. ఎన్నికల సమయంలో ముస్లిం ప్రజలను ఆకట్టుకొనేందుకే ఓవైసీ సోదరులు సాధారణంగా ఇటువంటి పనులు చేస్తుంటారు. అయితే అసదుద్దీన్ ఓవైసీని పోలీసులు అరెస్ట్ చేసిననత మాత్రాన్న అక్కడి ముస్లిం ప్రజలు ఆయనపై సానుభూతితో మజ్లీస్ అభ్యర్ధులకు ఓట్లేస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే బీహార్ ప్రజలకు ఇంతవరకు ఓవైసీ సోదరులను, మజ్లీస్ పార్టీని ఎన్నడూ చూడలేదు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆర్.జె.డి., జే.డి.యూ., తదితర పార్టీలు కూడా ఆ నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్ధులనే నిలబెట్టాయి. కనుక ప్రజలు వాటికే మొగ్గు చూపవచ్చును. ఒకవేళ ఈ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ రెండు మూడు సీట్లు గెలుచుకొన్నా అది దానికి గొప్ప విషయమే అవుతుంది. లేకుంటే మళ్ళీ హైదరాబాద్ పాతబస్తీకే పరిమితం కార్యక్రమానికి తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close