వరంగల్ ఎన్నికల బరిలో ఆ ఐదుగురు

వరంగల్ ఉప ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు బుదవారం సాయంత్రం గడువు ముగిసిన తరువాత మొత్తం ఐదుగురు అభ్యర్ధులు బరిలో మిగిలారు. వారు తెరాసకు చెందిన పసునూరి దయాకర్, టీడీపీ-బీజేపీల ఉమ్మడి అభ్యర్ధిగా దేవయ్య, కాంగ్రెస్ పార్టీ తరపున సర్వే సత్యనారాయణ, వామ పక్షాలు బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ కుమార్ మరియు వైకాపా తరపున నల్లా సూర్యప్రకాశ్ బరిలో మిగిలారు.

వారిలో దేవయ్య తప్ప మిగిలిన అందరూ మంచి రాజకీయ అనుభవం ఉన్నవారే. తెరాస అభ్యర్ధి తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని హైలైట్ చేస్తూ ప్రజలను ఓట్లు కోరవచ్చును. టీడీపీ-బీజేపీల ఉమ్మడి అభ్యర్ధిగా దేవయ్య నరేంద్ర మోడీ సమర్ధమయిన పరిపాలన, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, స్థానిక అంశాలను ప్రస్తావించి ఓట్లు కోరవచ్చును. ఇక వైకాపా అభ్యర్ధి నల్లా సూర్యప్రకాశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పధకాల గురించి ప్రచారం చేసుకొని ఓట్లు కోరవచ్చును. వామ పక్షాలు బలపరుస్తున్న గాలి వినోద్ కుమార్ తెలంగాణా ప్రభుత్వం రైతుల పట్ల ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి, రైతుల ఆత్మహత్యలు మొదలయిన అంశాలను ప్రస్తావించి ప్రజలను ఓట్లు కోరవచ్చును.

వారిలో దయాకర్ అధికార పార్టీకి చెందినవాడయి ఉండటం, దాని మద్దతు కలిగి ఉండటం ఆయనకి కలిసి వచ్చే అంశాలు. అలాగే ఎన్డీయే అభ్యర్ధి దేవయ్యకు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీకి చెందినవాడయి ఉండటం కలిసి వచ్చే అంశం. తనకు ఓటేసి గెలిపిస్తే జిల్లా అభివృద్ధికి కేంద్రం నుండి సహాయ సహకారాలు పొందవచ్చని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చును. వామ పక్షాలు బలపరుస్తున్న గాలి వినోద్ కుమార్ యువకుడు, మేధావి, తెలంగాణా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా మంచి పేరుంది కనుక ప్రజలు ఆయనను ఆదరించే అవకాశం ఉంది. పైగా వామ పక్షాలన్నీ ఆయనని బలపరుస్తున్నాయి. ఈ ఎన్నికలలో ఓట్లు చీల్చి తెరాసకు లబ్ది చేకూర్చడానికే వైకాపా నల్లా సూర్యప్రకాశ్ ను రంగంలో దింపి ఉండవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close