ఆ పొరపాటు మళ్ళీ చేయొద్దు: రోజా

వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా అభ్యర్ధి నల్లా సూర్యప్రకాష్ తరపున వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రచారం మొదలుపెట్టారు. ఆ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజి వరకు ఉచిత విద్య అందిస్తామని గొప్పలు చెప్పుకొంటారు. కానీ కనీసం స్కాలర్ షిప్పులు కూడా చెల్లించడం లేదు. కేసీఆర్ మాయ మాటలు నమ్మి అప్పుడు ఓటేస్తే వేసారు. కానీ ఈసారి మళ్ళీ అదే పొరపాటు చేయవద్దని వరంగల్ ప్రజలని కోరుతున్నాను. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఎల్లప్పుడూ పేద ప్రజల సంక్షేమం కోసం తపించేవారు. తెరాసకు తగిన గుణపాఠం చెప్పాలంటే వైకాపా అభ్యర్ధికే ఓటు వేయాలి,” అని అన్నారు.

కేజీ టు పీజి వరకు ఉచిత విద్య అందించే విషయంలో తెలంగాణా ప్రభుత్వం మాట తప్పిందా లేక దాని కోసం ఏర్పాట్లు చేయడానికి సమయం తీసుకొంటోందా? అనే విషయం పక్కనపెడితే, అదే ప్రభుత్వానికి పరోక్షంగా సహకరిస్తున్న వైకాపాకు ఎందుకు ఓటు వేయాలి? తెరాస ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశ్యంతో తెలంగాణా ప్రజల కోసం ఏనాడు పోరాడని వైకాపాకు ఎందుకు ఓటేయాలి? ఒకవేళ వైకాపా అభ్యర్ధిని గెలిపించినా ఆయనొక్కడివలన ఏమి సాధ్యమవుతుంది? వరంగల్ ప్రజలకు ఆయన ఏమి చేయగలరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వైకాపా ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తునపుడు, ఆ పార్టీ అభ్యర్ధిని గెలిపించి లోక్ సభకు పంపినా ఆయన మాటను కేంద్రం పట్టించుకొంటుందా? అసలు ఆయన జగన్ అనుమతి లేకుండా తెలంగాణా సమస్యల గురించి పార్లమెంటులో మాట్లాడే సాహసం చేయగలరా? అనే సందేహాలు కలుగకమానవు. బహుశః ఈ ప్రశ్నలకు వైకాపా వద్ద కూడా ఎటువంటి సమాధానాలు ఉండకపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close