అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు స్పందన

గత ఏడెనిమిది నెలలుగా దేశంలో మత అసహనం పెరిగిపోయిందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు.

“ప్రజలను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు. మరి కొందరు తప్పుదారి పడుతున్నారు. ఈ రెంటిలో ఎవరు ఏ వర్గానికి చెందుతారో నేను చెప్పదలచుకోలేదు. కానీ ఇటువంటి విష ప్రచారం మన దేశానికి ఏమాత్రం మేలు చేయదని ఖచ్చితంగా చెప్పగలను. ప్రధాని నరేంద్ర మోడి కేవలం అభివృద్ధి గురించే ఆలోచిస్తున్నారు తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయలనుకోవడం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకలో, కాంగ్రెస్ మిత్రపక్షం సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటనలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి కానీ ఆ సంఘటనలను కూడా మోడీ ప్రభుత్వానికే ఆపాదించి మత అసహనం పెరిగిపోతోందని కొందరు పనికట్టుకొని విష ప్రచారం చేస్తున్నారు.”

“బీజేపీని, మోడీని వ్యతిరేకించే కొందరు ప్రముఖులు సార్వత్రిక ఎన్నికల సమయంలో మా పార్టీని ఓడించమని కోరుతూ ప్రచారం చేసిన సంగతి మాకు తెలుసు. అటువంటివారే కొందరు తమ అవార్డులను వెనక్కి తిరిగి ఇచ్చేస్తూ ఈ విషప్రచారంలో పాలుపంచుకొంటున్నారని నేను భావిస్తున్నాను. మా ప్రభుత్వంలో అవినీతి అదుపులోకి వచ్చింది. మత ఘర్షణలు తగ్గాయి. విదేశాలలో మన పలుకుబడి పెరిగింది. దేశం ఆర్ధికంగా బలపడుతోంది. ఇవన్నీ చూసి జీర్ణించుకోలేక కొందరు పనిగట్టుకొని మా ప్రభుత్వానికి వ్యతిరకంగా ఈ విషప్రచారం ఆరంభించారు. దానిలో కొందరు ప్రముఖులు కూడా పాలుపంచుకోవడం చాలా దురదృష్టకరం. దేశాభివృద్ధి గురించి ఆలోచించవలసిన సమయంలో మన దేశ పరువు ప్రతిష్టలు మనమే మన చేతులతోనే మంటగలుపుకోవాలనుకోవడం చాలా శోచనీయం,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close