రవితేజ – శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న 4వ చిత్రం `అమర్ అక్బర్ ఆంటోనీ`. శుక్రవారం విడుదల అవుతోంది. టైటిల్ ప్రకటించినప్పటి నుంచీ ఈ సినిమాలో రవితేజలు ముగ్గురా, లేదంటే ఒక్కడే ముగ్గురిగా నటిస్తాడా? అనే ప్రశ్న సర్కిల్ అవుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇందులో రవితేజ ముగ్గురు కాదు. ఒక్కడే. కానీ ముగ్గురిలా నటిస్తాడన్నమాట. అపరిచితుడులో విక్రమ్ గుర్తున్నాడు కదా? ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంటాడు. స్ప్రిట్ పర్సనాలిటీ అన్నమాట. సరిగ్గా అదే థీమ్ ఇందులోనూ అన్వయించారని తెలుస్తోంది. చిన్నప్పుడు తన తల్లితండ్రుల్ని దూరం చేసిన ప్రతినాయక బృందాన్ని.. పెద్దయ్యాక ఎలా అంతం చేశాడన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో ఇలియానా పాత్రకూ చాలా ప్రాధాన్యం ఉంది. తను కూడా ప్రతీకార జ్వాలతో రగిలిపోతుందట. అయితే ఆ ప్రతీకారం ఎవరిపై అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. స్ప్రిట్ పర్సనాలిటీ డిజార్డర్తో చాలా సినిమాలొచ్చాయి. అపరిచితుడిలా అవేం హిట్లు అందుకోలేదు. అయితే ఇలాంటి పాత్ర చేయడం రవితేజకు కొత్త. మరి… ఈ మాస్ మహారాజ్ దానికి ఎంత వరకూ న్యాయం చేశాడో చూడాలి.