కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు… వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు.

ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్ రెడ్డి ప్ర‌తీక్ రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న‌లో చాలా మార్పు వ‌చ్చిందంటుంటారు స‌న్నిహితులు. అందుకే కోమ‌టిరెడ్డి త‌ల్లి సుశీల‌మ్మ పేరుతో ట్ర‌స్ట్ ఉన్నా స‌రే, ప్ర‌తీక్ రెడ్డి పేరు మీద కోమ‌టిరెడ్డి ప్ర‌తీక్ రెడ్డి ఫౌండేష‌న్ ఏర్పాటు చేశారు. ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు, పేద పిల్ల‌ల‌కు చ‌దువుకు స‌హ‌యం చేయ‌టం చేస్తుంటారు. తాజాగా, నల్గొండ ప్రభుత్వ ప్రసూతి, ఎన్‌ఐసీయూ వార్డుల్లో ఏకంగా 32ఏసీలను ఏర్పాటు చేశారు.

ఎండాకాలంలో ప్రసూతి ఆసుపత్రులకు వెళ్ళాలంటే గర్భిణులు భయపడిపోతుంటారు. కనీసం ఫ్యాన్స్ కూడా సరిగా ఉండవని… ఉక్కపోత గదుల్లో ఉండటం నరకమని భావించి ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతుంటారు. తన ఇలాకాలో అలాంటి పరిస్థితి రావొద్దని అనుకున్నారేమో కానీ, ఎవరూ కోరకుండానే నల్గొండ ప్రసూతి,ఎన్‌ఐసీయూ వార్డుల్లోఏసీలను తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయించారు. వేసవిలో గర్భిణీలు, చిన్న పిల్లలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించేలా వెంకట్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

త‌న కొడుకు భౌతికంగా దూర‌మైనా, జ‌నంలో బ‌తికుండాలే అన్న ఆశ‌యంతో కోమ‌టిరెడ్డి త‌న ఫౌండేష‌న్ ద్వారా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా పేద విద్యార్థులు బాగా చ‌ద‌వుకుని, ఆర్థిక స్థోమ‌త లేని వారికి, కుటుంబ పెద్ద కోల్పోయిన వారికి అండ‌గా ఉంటుంటారు. పార్టీ కార్య‌కర్త‌ల‌కు కూడా ఏ క‌ష్టం వ‌చ్చినా అండ‌గా ఉండే కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డిని జిల్లా ప్రజలకు మరింత చేరువ చేయగా… రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఆదరణ పెరిగేలా చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close