బెంగుళూరులో మరో నిర్భయ ఘటన

రెండేళ్ళ క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తరువాత అటువంటి నేరాలు పాల్పడేవారిని శిక్షించడం కోసం కేంద్రప్రభుత్వం చాల కటినమయిన నిర్భయ చట్టం అమలులోకి తీసుకువచ్చింది. అయినా దేశంలో మహిళలపై అత్యాచారాలు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు పైగా ఇప్పుడు అభం శుభం తెలియని చిన్నారుల మీద కూడా కామాంధుల అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. అందుకు కారణం ఇంతవరకు అటువంటి నేరాలకు పాల్పడివారికి కటినమయిన శిక్షలు పడినట్లు దాఖలాలు లేకపోవడమేనని చెప్పవచ్చును. ఒకవేళ ఒకటి అరా శిక్షలు పడుతున్న వాటి గురించి మీడియా ప్రచారం చేయకపోవడంతో అటువంటి నేరాలకు పాల్పడినా తాము కూడా సులువుగా తప్పించుకోగలమనే ధీమాతో కొందరు మహిళలు, చిన్నారులపై చాలా నిర్భయంగా అత్యాచారాలు చేస్తున్నారు.

బెంగుళూరు సమీపంలో హోస్పాడు అనే పట్టణంలో అటువంటి నిర్భయ ఘటనే జరిగింది. కదులుతున్న ఒక బస్సులో ఒక నర్సింగ్ విద్యార్ధినిపై ఆ బస్సు డ్రైవర్ అత్యాచారం చేసాడు. ఆమెతో బాటు బస్సు ఎక్కిన ఆమె సహచరులు అందరూ ఒకరొకరుగా ముందు స్టాపులలో దిగిపోవడంతో ఆమె బస్సులో ఒంటరిగా ఉంది. అది గమనించిన బస్సు డ్రైవర్ రవి క్లీనర్ కు బస్సు అప్పగించి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే అంత దురదృష్టకర ఘటనలో ఆమె అదృష్టం ఏమిటంటే బస్సు డ్రైవర్ ఆమెపై అత్యాచారం చేసిన తరువాత చంపకుండా ఒక నిర్జన ప్రదేశంలో వదిలేసి వెళ్ళిపోయాడు. అటుగా వెళుతున్నవారు ఆమెను రక్షించి ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు పిర్యాదు చేశారు. తక్షణమే రంగంలోకి దిగిన ఆ బస్సు డ్రైవర్, క్లీనర్ ఇద్దరినీ వెతికి పట్టుకొని అరెస్ట్ చేసారు. ఈరోజు మధ్యాహ్నం వారిద్దరినీ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టి అనుమతి తీసుకొన్న తరువాత వారిని ప్రశ్నిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close