వైసీపీ, ఏపీ బీజేపీ మధ్య అలా రాజీ చేసేశారు !

ప్రధాని మోదీ పర్యటన గురించి తమకు సమాచారం లేదని.. ఏపీ బీజేపీ నేతలు అసంతృప్తికి గురయ్యారు. బహిరంగసభ మొత్తం వైసీపీ కనుసన్నల్లో విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరుగుతున్నా ఎవరూ ఆపకపోవడంతో వారు మరింత ఖిన్నులయ్యారు. అంతా సోము వీర్రాజే చేస్తున్నారని.. వైసీపీ కోవర్టుగా ఉన్నారని ఓ వర్గంలో అసంతృప్తి మొదలయింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో…ఓ తార్కిక ముగింపును హైకమాండ్ ఇచ్చింది. ప్రధాని మోదీ రోడ్ షో కోసం ఏపీ బీజేపీకి చాన్సిచ్చారు. బహిరంగసభను వైసీపీకి సర్దుబాటు చేశారు. నిన్నటిదాకా ప్రధాని మోదీ పర్యటనలో లేని రోడ్ షో ను ఇవాళ యాడ్ చేశారు.

నవంబర్ 11 సాయంత్రం 6 గంటలకు INS డేగా వద్ద గల మారుతీ జంక్షన్ నుండి నావెల్ డాక్ యార్డ్ రోడ్ మీదగా శోభా యాత్ర జరిపేలా షెడ్యూల్ మార్చారు. దీంతో ఏపీ బీజేపీ నేతలు సంతోషపడ్డారు. ప్రధాని మోదీ వస్తున్నా.. తమకు ఎలాంటి సమాచారం ఉండటం లేదని.. అంతా వైసీపీ నేతలే హైజాక్ చేస్తున్నారని.. నిన్నటి వరకూ బాధపడ్డారు. జీవీఎల్ కూడా విశాఖలోనే మకాం వేసి.. ఆ ప్రోగాం ప్రధానిదని.. అంటే బీజేపీదన్నట్లుగా చెప్పుకునే ప్రయత్నం చేశారు.కానీ యాక్టివ్‌గా ఎలాంటి అవకాశాన్నీ .. నేరుగా పాలు పంచుకునే చాన్స్‌ను విజయసాయిరెడ్డి బీజేపీ నేతలకు ఇవ్వలేదు.

చివరికి హైకమాండ్ వద్ద మొర పెట్టుకుని ఏపీ బీజేపీ నేతలు ఎలాగోలా రోడ్ షోకు పర్మిషన్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ రోడ్ షోకు జనాలను సమీకరించాల్సిన బాధ్యత బీజేపీ నేతలపై పడింది. జనం కనిపించకపోతే.. బీజేపీ నేతల పరువు పోతుంది. బహిరంగసభ బాధ్యత వైసీపీ తీసుకుంది కాబట్టి.. ఎలాగోలా.. అందర్నీ సమీకరించి తీసుకొస్తుంది. కానీ రోడ్ షోకు మాత్రం బీజేపీ టెన్షన్ పడాల్సిందే. పట్టుబట్టి మరీ రోఢ్ షోకు అనుమతి తెచ్చుకున్న ఏపీ బీజేపీ.. దాన్ని విజయవంతం చేయాల్సి ఉంది. మొత్తంగా ఈ పరిణామాలను చూస్తే.. ఏపీ బీజేపీ, వైసీపీ మధ్య అలా రాజీ కుదిరిందని సెటైర్లు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close