తుని విద్వంసం కేసు దర్యాప్తులో పురోగతి

ప్రతీ క్రియకి ప్రతిక్రియ ఉంటుందని న్యూటన్ మహాశయుడు ఎప్పుడో చెప్పాడు. ఆ సిద్దాంతానికి రాజకీయాలు కూడా అతీతం కాదని నిరూపిస్తూ అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అలాగే తుని విద్వంసం వెనుక వైకాపా నేతలున్నారని తెదేపా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నిత్యం విమర్శలు కురిపిస్తున్నారు. వారిలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల చాలా అనుచితంగా మాట్లాడగా, ఆగస్ట్ నెలాఖరులోగా కాపులకు రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రకటన చేయకపోయినట్లయితే, తాను మళ్ళీ ఉద్యమానికి సిద్దం అవుతానని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. వారిరువురి తీరుపట్ల తెదేపా నేతలు అందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు.

తిరుపతికి చెందిన వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి, తుని విద్వంసానికి ముందు ముద్రగడని కలిసారని, ఆయనతో ఫోన్ లో మాట్లాడినట్లు తుని సెల్ టవర్ నుంచి వెళ్ళిన కాల్స్ డాటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. కరుణాకర్ రెడ్డి కూడా తాను ముద్రగడని కలిసిన మాట వాస్తవమే కానీ తెదేపా నేతలు ఆరోపిస్తున్నట్లుగా తుని విద్వంసానికి మూడు రోజుల ముందు కాకుండా మూడు నెలల ముందు కలిసినట్లుగా చెప్పారు. ముద్రగడతో ఆయనకి పరిచయాలు ఉండటం నేరం, విశేషమేమీ కాకపోయినా, ఆయనను, వైకాపాని ఇబ్బంది పెట్టేందుకు ఆ మాత్రం లింక్ సరిపోతుంది.

ఆ విద్వంసంపై గత 4నెలలుగా సి.ఐ.డి.పోలీసులు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు కడప జిల్లా నుంచి 10 మందిని, గుంటూరు జిల్లాకి చెందిన 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం దూడల ఫణి అనే రౌడి షీటర్ ని అదుపులోకి తీసుకొన్నారు. వైకాపా నేతలతో అతనికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒకవేళ అతను ఎవరైనా వైకాపా నేతల పేర్లు చెప్పినట్లయితే, ఇక దర్యాప్తు వేగవంతం అవవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close