6నెలల తర్వాత సవాల్ చేసి అర్జంట్‌గా విచారణ కావాలంటున్న ఏపీ ప్రభుత్వం !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విషయంలోనూ పారదర్శకంగా ఉండదు. ఏదో గూడు పుఠాణి చేస్తున్నట్లుగా వ్యవహారాలు నడుపుతూ ఉంటుంది. తాజాగా అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో దాదాపుగా ఆరు నెలల తర్వాత పిటిషన్ వేసింది. నిబంధనల ప్రకారం ఆ పిటిషన్ విచారణకు రావడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం అధికారికంగా నేరుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసింది. అర్జంట్‌గా విచారణ జరపాలని అందులో కోరింది.

అర్జంట్‌గా విచారణ జరపడానికి కొన్ని కారణాలు చెప్పింది.అందులో తాము కార్యాలయాలు తరలించలేకపోతున్నామన్నది ఒకటి. అసలు మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంది ప్రభుత్వం. అలాంటప్పుడు కార్యాలయాలు ఎలా తరలిస్తుందనేది సస్పెన్స్. అదంతా పోని.. అసలు అంత అర్జెన్సీ అయితే.. తీర్పు వచ్చిన ఆరు నెలల పాటు ఎందుకు ఉగ్గబట్టుకున్నరన్నది న్యాయవర్గాలకూ అంతుబట్టదు. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాత్రం ఏపీ ప్రభుత్వం నుంచి విచారణ జరపాలని లేఖ వచ్చినందున వెంటనే స్పందించారు.

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు లిస్టింగ్ చేయాలని ఆదేశించారు. నవంబర్ ఒకటో తేదీన ఈ పిటిషన్ విచారణకు వచ్చేలా రిజిస్ట్రి లిస్టింగ్ చేశారు. ఆ రోజున సీజేఐ బెంచ్ ఈ కేసును విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అమరావతి రైతులు.. ఎలాంటి ఉత్తర్వులు అయినా ఇచ్చే ముందు తమ వాదన వినాలని కేవియట్ లుదాఖలుచేశారు. కాబట్టి ఆ రోజున విచారణలో అందరి వాదనలు వినే అవకాశం ఉంది. ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్.. వచ్చే నెల ఎనిమిదో తేదీన రిటైర్ అవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close