విజయసాయిపై బండ్ల గణేష్ తిట్ల దండకం !

ఎవరి మీద అయినా కోపం వస్తే తీర్చుకోవడానికి బండ్ల గణేష్‌కు ట్విట్టర్ ఉంది. ఆ ట్విట్టర్ అకౌంట్‌నే ఆయుధంగా చేసుకుని .. తన వ్యతిరేకులపై దాడి చేస్తూంటారు. గతంలో చాలా మందిపై ఆలా ట్వీట్ వార్ కు దిగారు. ఇప్పుడు ఆయన దృష్టి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పడింది. ఆయనపై వరుస ట్వీట్లు చేసి తిట్ల దండకం వినిపించారు. ” వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి అంటూ విరుచుకుపడ్డారు. అంతే కాదు షర్మిల జగన్‌తో విభేదించడానికి కూడా కారణం విజయసాయిరెడ్డేనన్నట్లుగా మరో ట్వీట్ చేశారు.

మొత్తంగా బండ్ల గణేష్ ట్వీట్ వైసీపీని టార్గెట్ చేయలేదు. ఒక్క విజయసాయిరెడ్డినే టార్గెట్ చేశారు. సీఎం జగన్‌ను విజయసాయిరెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారన్నట్లుగా మాట్లాడారు. హఠాత్తుగా బండ్ల గణేష్ ఎందుకిలా చేశారో సినీ ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకంగా విశాఖ గురించి ప్రస్తావించారంటే అక్కడ బండ్ల ఏదైనా లావాదేవీలు చేయాలనుకుంటే… విజయసాయిరెడ్డి కారణంగా తేడా వచ్చిందేమోనన్న అభిప్రాయం చాలా మందిలో కలుగుతోంది. అదే సమయంలో రాజకీయంగా టార్గెట్ చేయలేదన్న విషయం సులువుగా అర్థం చేసుకోవచ్చు.

విజయసాయిరెడ్డి … బండ్ల గణేష్ కు సంబంధించిన వ్యవహాల్లో జోక్యం చేసుకోవడమో.. లేకపోతే విశాఖలో ఏదైనా భూ లావాదేవీల్లో తేడా రావడమో జరిగి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇక్కడ బండ్ల గణేష్ కుల ప్రస్తావన కూడాతీసుకు వచ్చారు. విజయసాయిరెడ్డి ఓ కులాన్ని నిందిస్తున్నారని.. తాను ఆ కులానికి చెందిన వాడ్ని కాబట్టి స్పందిస్తున్నానని చెప్పుకొచ్చారు. కానీ విజయసాయిరెడ్డి కానీ.. వైసీపీ కానీ.. ఓ కులాన్ని నిందించడం ఇదే మొదటి సారి కాదు . మరి బండ్లకు ఎందుకు ఆవేశం వచ్చింది ? దాని వెనుక ఏం ఉంది అన్నది ఆయన బయటపెడితేనే తెలియాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close