బొత్సకు “బంగార్రాజు హత్య” టెన్షన్ !

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి రైతులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు కానీ ఆయన చుట్టూ ఓ హత్య కేసు వివాదం ముసురుకుంటోంది. ఆయన మేనల్లుడు కోరాడ లక్ష్మణరావు విశాఖలో ఓ విద్యుత్ లైన్‌మెన్‌ను చంపేశారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మంత్రి బొత్స మేనల్లుడైన కారణంగా పోలీసులు కేసులు కూడా పెట్టడం లేదన్న గుసగుసలు విశాఖ మొత్తం వ్యాపించాయి. నాలుగు రోజుల కిందట పద్మనాభంలో లైన్‌మెన్ బంగార్రాజు బొత్స మేనల్లుడుకి చెందిన గెస్ట్ హౌస్ పక్కన విగత జీవిగా పడి ఉన్నాడు.

అతడ్ని హత్య చేశారని బంధువులు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం పోస్ట్ మార్టం కూడా చేయించలేదు. దీంతో బంగార్రాజు బంధువులు ఆందోళనకు దిగారు. మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు కోరాడ లక్ష్మణరావు, మరో వ్యక్తి గోవిందు కలిసి హతమార్చారని వారు చెబుతున్నారు. విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారు రూ.కోటికి పైగా డబ్బులు తీసుకుని..ఉద్యోగాలు ఇప్పించలేదు. ఈ విషయం మాట్లాడేందుకు బంగ్రాజును పిలిచి లక్ష్మణరావు గెస్ట్ హౌస్‌లో హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

యాదవ సంఘాలు , రాజకీయ పార్టీలు ఆ కుటుంబానికి మద్దతుగా రోడ్డు మీద ఆందోళనలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా డీజీపీకి లేఖ రాశారు. తక్షణం నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే బొత్స మేనల్లుడి పేరును కేసులో చేర్చడం కానీ.. కనీసం దర్యాప్తు చేసే ధైర్యం కానీ పోలీసులు చేయడం లేదు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం జరగడం కష్టమని విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిర్లక్ష్యమే ముంచింది…కాళేశ్వరంపై నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని...

పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్ – విప్లవమే !

ఐదేళ్ల పాలనలో తాను చాలా విప్లవాలు తెచ్చానని జగన్ రెడ్డి చెబుతూ ఉంటారు. విప్లవం అంటే ఆ రేంజ్ అనుకుంటున్నారో కానీ ఆయన కానీ ఆయన రచయితలు కానీ ఆ పదాన్ని...

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదూ కూటమికే ప్రచారం చేస్తారట !

జగన్ ఓటమి ఖాయమని తేలిపోయిందని అంచనాకు వచ్చిన భజన బ్యాచ్ లో కొంత మంది తమ పాత పరిచయాలను అడ్డం పెట్టుకుని బయటకు వచ్చి కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు. యార్లగడ్డ...

గ్రేటర్ లో వర్షం పడితే ఇంతేనా..!?

గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం కురిసిన కుండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదనీరుతో రోడ్లు, వీధులన్నీ నిండిపోయాయి. దాదాపు రెండు గంటలపాటు వర్షం దంచి కొట్టడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close