ఆర్కే పలుకు : కేసీఆర్‌ను ఓడించడమే తెలంగాణ ప్రజల ఎజెండా !

హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలపై కొన్ని వందల విశ్లేషణలు వచ్చి ఉంటాయి. అయితే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే ఎనాలసిస్ కోసం రాజకీయం అంటే ఆసక్తి ఉన్న వారు ప్రత్యేకంగా ఎదురు చూశారు. దానికి కారణంగా కేసీఆర్‌ రాజకీయంపై ఆయన మొదటి అడుగులు ప్రారంభించినప్పటి నుండి ఆర్కే స్వయంగా పరిశీలిస్తూండటమే కాదు .. కేసీఆర్ సీఎం కాక ముందు వరకూ మంచి స్నేహం కూడా ఉండేది. అందుకే ఆర్కే వారాంతంలో రాసే కొత్త పలుకులో ఏం చెబుతారా అని ఆసక్తిగా చూశారు.

తన పాత స్నేహితుడు, తెలంగాణ బాద్షాగా పేరు పొందిన కేసీఆర్‌కు ఇక గడ్డు కాలమేనని.. ఆయనపై ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో హుజురాబాద్ ఫలితం బయట పెట్టిందని ఆర్కే విశ్లేషించారు. టీఆర్ఎస్‌ను ఎవరు అయితే ఓడిస్తారో ప్రజలు వారికే మద్దతుగా నిలుస్తున్నారని ఈ ఫలితం తేల్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులపై నిలబడేవారిని పార్టీ పరంగా చూడకుండా ఎవరైతే టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించగలరో వారికే ప్రజలు ఓట్లు వేస్తారని.. తేల్చేశారు. దానికి లాజికల్‌గా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. దాదాపుగా అరవై వేల ఓట్లు ఉన్న కాంగ్రెస్ కు అక్కడ మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ నేతలు చెప్పినంత మాత్రాన ఇలా మూకుమ్మడిగా ఓ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. అయినా వేశారంటే హుజురాబాద్ ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారో అర్థం చేసుకోవాలని అంటున్నారు.

అలాగే బీజేపీ అంటేనే గిట్టని ముస్లింలు ఈటల కోసం అదేం పట్టించుకోకుండా బీజేపీకి ఓట్లేశారని ఆర్కే విశ్లేషించారు. ఇవన్నీ చూస్తూంటే కేసీఆర్‌పై తెలంగాణ సమాజంలో పట్టరానంత ఆగ్రహం ఉందని .. అది సాధారణ ఎన్నికల్లో మరింత ప్రబలంగా బయటపడుతుందని ఆర్కే తేల్చేశారు. ప్రతిపక్షాల వల్ల ఓట్లు చీలి కేసీఆర్ లాభపడే చాన్స్ కూడా లేకుండా ప్రజలు అవగాహన తెచ్చుకున్నారని… ఎవరు టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడిస్తారో వారికే ఓటేస్తారని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులుగా కనిపిస్తారు కానీ వారిలో ఉన్న పరిణితి ఎవరికీ లేదని సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు.

ఈ వారాంతపు ఆర్టికల్‌లో ఆర్కే చెప్పిన మరో అంశం … ఈటలను కేసీఆర్‌తోనే పోల్చడం. కేసీఆర్‌ను చంద్రబాబుతో పోల్చడం. మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంగా కేసీఆర్ తెలంగాణ ఉద్యమబాట ఎంచుకున్నారు. ఇదే విషయాన్ని గుర్తు చేసిన ఆర్కే ఆ రోజు కేసీఆర్ విషయంలో చంద్రబాబు చేసిన తప్పే ఇప్పుడు ఈటల విషయంలో కేసీఆర్ చేశారని తేల్చేశారు. ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబుకు ఎంత నష్టం చేశారో.. రేపు ఈటల కూడా కేసీఆర్‌కు అంతే నష్టం చేయబోతున్నారని దాన్ని ఎవరూ ఆపలేరని ఆర్కే అన్యాపదేశంగా చెప్పారు. కొసమెరుపేమింటటే కేసీఆర్ హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం తీసుకొచ్చిన దళిత బంధు పథకమే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకోబోతోందని.. అది మరింత వేగంగా పతనం దిశగా తీసుకెళ్తుందని చెప్పకనే చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close