జగన్‌కు వారమే గడువిచ్చిన బీజేపీ..!

ఇసుక కొరత విషయంలో పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చారు కానీ.. ఏపీ బీజేపీ మాత్రం.. అంత సమయం ఇవ్వాలనుకోవడం లేదు. వారం రోజుల్లో ఇసుక కొరతను తీర్చి.. కూలీల సమస్యను పరిష్కరించాలని… ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలో ఇసుక సత్యాగ్రహం చేసిన.. ఏపీ బీజేపీ నేతలు ఈ మేరకు.. జగన్ సర్కార్ కు డెడ్ లైన్ పెట్టారు. ఇసుక వారోత్సవాలు జరిపి సమస్యను పరిష్కరిస్తామన్న ప్రభుత్వం ఇంత వరకూ ఉలుకూ పలుకు లేదనిఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. వారం రోజుల్లో ఇసుక సమస్య తీరుస్తామన్న ప్రభుత్వం… తేదీ, నెల, సంవత్సరం చెబితే మంచిదనిసెటైర్ వేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాకుండా… రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఇసుక కొరతతో లక్షల మంది కార్మికులు ఆకలితో అలమటిస్తున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని.. బీజేపీ నేతలు మండిపడ్డారు. కృష్ణా, గోదావరిలో వరదలు వస్తే సీమలో ఇసుక కొరత ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఐదు నెలల్లోనే మీ పాలనలో అరాచక పరిస్థితులు కనిపిస్తున్నాయని.. వచ్చే నాలుగన్నరేళ్లు పాలన ఎలా ఉంటుందో తలుచుకుంటుంటే భయమేస్తోందని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిట్టినా, బెదిరించినా, జైల్లో పెట్టినా పోరాటం ఆపేది లేదన్నారు. వైసీపీ నేతలు అక్రమ సంపాదన మానుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఇసుక కొరత ఏర్పడటం వల్ల.. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయిందన్నారు.

ఎకనామిక్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనీ సర్క్యూేషన్ పడిపోయిందని.. దీని వల్ల ప్రజల జీవితాలు దిగజారిపోయాయని మండిపడ్డారు. విజయవాడ ఇసుక సత్యాగ్రహంలో.. బీజేపీ నేతలందరూ పాల్గొన్నారు. ఇసుకపై తామే మొదటి నుంచి పోరాడుతున్నామని.. చెప్పుకొచ్చారు. ఇసుక సమస్యపై పోరాడుతున్న టీడీపీ, జనసేన నేతలపై.. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కానీ బీజేపీ విషయంలో వారు స్పందించే అవకాశం లేదు. బీజేపీ నేతలు ఎన్ని తిట్టినా… స్పందించలేని పరిస్థితి వైసీపీ నేతలది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close