ఆత్మకూరులో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జయప్రద !

ఆత్మకూరులో బీజేపీ ఏ చాన్సునూ వదిలి పెట్టకూడదని అనుకుంటోంది. చివరికి జయప్రదనూ రంగంలోకి దింపుతోంది. స్టార్ క్యాంపెయినర్‌గా ఆమెను ఆత్మకూరులోప్రచారంలోకి తిప్పాలని నిర్ణయించారు. ఇటీవల ఏపీ రాజకీయాల్లో జయప్రత క్రియాశీలకంగా మారేందుకు సిద్ధమయ్యారు. రాజమండ్రిలో బీజేపీ సభలోనూ పాల్గొన్నారు. వైఎస్ఆర్‌సీపీ పాలనపై విమర్శలు చేశారు. తున్నారు. తాను పుట్టిన గడ్డను ఎప్పటికీ మరచిపోనని చెప్పారు జయప్రద. ఇప్పుడామె ఆత్మకూరు ప్రచారానికి రాబోతున్నారు.

వైసీపీ తరపునరోజా ఇప్పటికే అక్కడ చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. ఆమెకు ఓ మండలం బాధ్యతలుకూడా ఇచ్చారు. ఆమెకు పోటీగా జయప్రదను సోము వీర్రాజు రంగంలోకి దింపుతున్నారు. ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్ కుమార్ రంగంలోకి దిగారు. ఆయన స్థానికేతరుడు. పలు పేర్లు వినిపించినా చివరికి ఎవరూ మొగ్గు చూపకపోవడంతో స్థానికేతరుడైన భరత్ కుమార్ ని రంగంలోకి దింపారు.

అయితే అభ్యర్థితోపాటు నాయకులెవరూ పెద్దగా ప్రచారానికి వెళ్లట్లేదు. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు. వైసీపీ కూడా పదిమంది మంత్రులను రంగంలోకి దింపింది. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఓ మంత్రి వచ్చారు, ఆయనతోపాటు మరో ఇన్ చార్జి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వీరికి తోడు జిల్లా మంత్రి, ఇన్ చార్జి మంత్రి.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close