కృష్ణా జిల్లా నుండి వైకాపా నేత తెదేపాలోకి జంప్?

కడప జిల్లాకి చెందిన ఒక ప్రముఖ వైకాపా ఎమ్మెల్యే త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సదరు నేత పార్టీలో నుండి జంప్ అవక మునుపే ఇప్పుడు కృష్ణా జిల్లాకి చెందిన మరో సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కడప జిల్లా ఎమ్మెల్యే పేరుని మీడియా కూడా బయటపెట్టలేదు కానీ వేదవ్యాస్ పేరును బయటపెట్టడం గమనార్హం. అంటే వేదవ్యాస్ పార్టీ మారడం ఖాయం అని భావించవచ్చును.

ఆయన కాంగ్రెస్ నుండి ప్రజా రాజ్యంలోకి వెళ్లి దానితో బాటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిపద్దారు. మళ్ళీ నిరుడు జరిగిన ఎన్నికలలో వైయస్సార్ పార్టీలోకి జంప్ చేసి పెడన నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత బీజేపీలోకి మారుదామని ప్రయత్నించారు కానీ ఎందువల్లో మారలేదు. ఇప్పుడు ఆయన తెదేపాలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందని తాజా సమాచారం. ఏ కార్యక్రమం మొదలుపెట్టడానికయినా విజయదశమి చాలా మంచి రోజుగా భావిస్తారు కనుక వేదవ్యాస్ అదేరోజు పార్టీ మారవచ్చునని సమాచారం.

తెదేపాకు మంచి పట్టున్న కృష్ణా జిల్లాలో వైకాపా ఎంత ప్రయత్నించినా బలపడలేదనే ఉద్దేశ్యంతోనే ఆయన పార్టీ మారబోతున్నారని సమాచారం. త్వరలోనే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడకి తరలివస్తే తెదేపా నేతలు, మంత్రులు అందరూ అక్కడే ఉంటారు కనుక కృష్ణ, గుంటూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి, జిల్లాలపై వారి పట్టు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు సహజంగానే ఆ ప్రాంతాలలో వైకాపా బలహీనపడవచ్చును. బహుశః బూరగడ్డ వేదవ్యాస్ ఈ సంగతిని అందరి కంటే ముందే పసిగట్టి, తెదేపాలో ‘నో-వేకెన్సీ’ బోర్డు పెట్టేయక ముందే అందులో చేరిపోవాలనుకొంటున్నారేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close