ఖాళీగా ఉండి కరెంట్ వాడుకోవడం వల్లే ఎక్కువ బిల్లులట..!

లాక్‌డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లలోనే ఉన్నారు. వారు విపరీతంగా కరెంట్ వాడుకున్నారు. అందుకే ఎక్కువ బిల్లులు వచ్చాయిని… ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. రాష్ట్రం మొత్తం కరెంట్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని ప్రజలు గగ్గోలు పెడుతూంటే.. వారికి వివరణ ఇవ్వడానికి ఏపీ సర్కార్ కు తలకు మించిన భారం అవుతోంది. విద్యుత్ బిల్లుల విషయంలో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తూండటంతో ఎలా సర్ది చెప్పాలో తెలియక ప్రభుత్వం సతమతమవుతోంది. రోజుకో మంత్రి వివరణ ఇస్తున్నా…ప్రజల్లోకి వెళ్లడం లేదు. దీంతో ఈ సారి బాధ్యతను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీసుకున్నారు. ఆయన కొన్ని విద్యుత్ బిల్లులను తీసుకుని మీడియా ముందుకు వచ్చారు.

అందులో బిల్లులకు ఎలా చార్జ్ చేశారో వివరించారు. తాము ఐదు వందల యూనిట్లు దాటిన వారికి మాత్రమే.. యూనిట్‌కు 90పైసలు పెంచామని..మిగతా ఏ కేటగిరీకి కూడా పెంచలేదని స్పష్టం చేశారు. మరి ఎందుకు బిల్లులు ఎక్కువగా వచ్చాయన్నదానిపై ఆయన ఒక్కటే వాదన వినిపించారు.లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉన్నారని.. అందుకే కరెంట్ వినియోగం పెరిగిందని చెబుతున్నారు. ఎంత మంది ఇళ్లలో ఉన్నా మధ్యతరగతి ప్రజలు వాడేది మహా అయితే రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు… ఓ టీవీ. అంత దానికి నెలకు ఐదు వందల యూనిట్లు దాటిపోయేంత బిల్లురాదు.

కానీ ఎక్కువ మందికి ఐదు వందల యూనిట్లు దాటిపోయి.. బిల్లులు అత్యధికంగా వచ్చాయి. ఇలాంటి కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ.. విద్యుత్ బిల్లుల విషయంలో ప్రజలకు ఏదో ఓ భరోసా ఇవ్వాల్సి ఉంది. లేకపోతే.. ప్రభుత్వానికే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close