జగన్ డిసైడ్ ..! చంద్రబాబు హయాంలో అవినీతిపై విచారణకు కేబినెట్ సబ్ కమిటీ..!

చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి కేబినెట్ సబ్ కమిటీని నియమించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మొత్తం 30 అంశాలపై విచారణ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల సహకారాన్ని.. కేబినెట్ సబ్ కమిటీ తీసుకుని అవినీతిని వెలికి తీయాలని జగన్ నిర్ణయించారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు.. కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. విద్యుత్ రంగంపై జగన్ మోహన్ రెడ్డి జరిపిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ రంగంలో.. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని.. జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

సోలార్, విండ్‌ పవర్‌ కొనుగోళ్లలో కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ రేట్లకన్నా అధిక రేట్లకు కొనుగోలు చేశారని.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.2, 636 కోట్లు నష్టం వాటిల్లిందని జగన్ తేల్చారు. ఈ డబ్బును రికవరీ చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టులు పొందిన కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సోలార్, విండ్‌ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని.. ఉన్నతాధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి ఉన్నా సరే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నిజానికి… జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచీ.. విద్యుత్ కొనుగోలు పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కేంద్రం నుంచి.. ఏపీ సర్కార్‌కు ఓ లేఖ కూడా వచ్చింది. అలాంటి ప్రకటనలు చేయడం వల్ల.. పెట్టుబడిదారులు.. భయపడతారని… ధరల నిర్ణయానికి ఓ ప్రక్రియ ఉంటుందని.. బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయవద్దని… ఆ లేఖలో సూచించారు. అయితే.. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పట్టు వీడలేదు. ప్రధాని తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు.. ఈ లేఖ అంశాన్ని ప్రస్తావించి.. విచారణ జరిపించేందుకు అనుమతి తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే.. తొలి కేబినెట్‌లోనే విచారణ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు.. సబ్ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు.

2004లో చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు.. వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కూడా.. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని.. పలు సబ్ కమిటీలను.. నియమించారు. అయితే.. ఆ కమిటీ నివేదికల్లో ఏమీ తేలలేదు. దీనిపై టీడీపీ నేతలు తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా… కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. మరి అవినీతి సంగతి తేలుస్తారో లేదో ..!?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close