ఎర్రచందనం రక్షణకు రంగంలోకి కేంద్రం..!?

ఎర్రచందనం విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా కనిపిస్ోతంది. గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపారని.. కానీ ఇప్పుడు విచ్చలవిడిగా జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తేల్చేశారు. అక్రమ ఎర్రచందనం రవాణాను అరికట్టడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని తాను ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలిపారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన కిషన్ రెడ్డి.. ప్రత్యేకంగా ఎర్రచందనం చెట్టు నాటే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా.. భారతీయ జనతా పార్టీ నేతలు.. ఏపీలో ఎర్ర చందనం అక్రమ రవాణా గురించి కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఈ ఫిర్యాదుల క్రమంలో హోంశాఖ సహాయమంత్రి హోదాలో ఏపీ సర్కార్‌కు లేఖ కూడా రాశారు. పెద్ద ఎ్తతున ఎర్రచందనం తరలి పోతోందని… స్మగ్లింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇప్పుడు తిరుమలకు వచ్చి గతంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని … ఇప్పుడు తీసుకోవడం లేదని నేరుగా చెప్పడం సంచలనంగా మారింది.

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కేంద్ర తరుపున చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్రానికీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నారు. ఎర్రచందనాన్ని జాతీయ సంపదగా గుర్తించి కాపాడుకోవాల్సి ఉందన్నారు. గతంలో స్మగ్లర్లు రోజూ దొరికేవారు. కానీ ఇప్పుడు.. అసలు దొరకడం లేదు. ఏదైనా ప్రమాదాలు జరిగి వారికి వారు పట్టుబడాల్సిందే తప్ప.. పోలీసులు పట్టుకోవడం లేదు. కేంద్రమే ఈ విషయంలో ఏదో ఓ యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచనతోనే కిషన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోడ్ ఉండ‌గా ఏపీలో టీచ‌ర్ల బ‌దిలీలు… తెర వెనుక ఉంది ఆయ‌నేనా?

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా ఎలాంటి నిర్ణ‌యాలు ఉండ‌వు. రూల్స్ ప్ర‌కారం... ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు రోజు వారీ కార్య‌కాలాపాలు మాత్ర‌మే జ‌రుగుతుంటాయి. కొత్త ప్ర‌భుత్వాలు ఏర్పాడ్డాక లేదంటే కోడ్...

రూల్స్ పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లొద్దు : సజ్జల

సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లకు రూల్స్ పాటించవద్దని చెప్పి పంపించారు. శిక్షణా కార్యక్రమం పెట్టి రూల్స్ చెప్పాల్సిన పెద్ద మనిషి రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ కు వెళ్లొద్దని రూల్స్ విరుద్ధంగా వైసీపీకే...

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు… పత్తాలేని బీజేపీ..!!

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది అధికార కాంగ్రెస్. పైకి తెలంగాణ ఖ్యాతిని చాటేందుకు అని చెబుతున్నా కాంగ్రెస్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చాటడమే ఆ...

టెర్రరిస్టులకు సీఎం రేవంత్ నెంబర్ ఇచ్చిన రాజాసింగ్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టెర్రరిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. ఆయనకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఐదారు నెంబర్ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close