వైసీపీ అభ్యర్థుల్లో భారీ మార్పులు – వలస నేతలకు చాన్సులు !

వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో భారీ మార్పు చేర్పులు చోటు చేసుకోవడ ఖాయంగా కనిపిస్తోంది. పలు చోట్ల అభ్యర్థులు లేక ఎవరినో ఒకరిని ఖరారు చేసిన వైసీపీ అధినేత ఇప్పుడు ఇతర పార్టీల వారికి ఆఫర్లు ఇచ్చి చేర్చుకుంటున్నారు. పలు నియోజకవర్గాల నుంచి వైసీపీలో చేరుతున్న నేతలంతా టిక్కెట్ల ఆఫర్‌తోనే చేరుతున్నారు

పోతిన మహేష్ ను తాజాగా వైసీపీలో చేర్చుకున్నారు. పవన్ కల్యాణ్ కుటుంబాన్ని కూడా విమర్శించిన ఆయనకు వైసీపీ ఆఫర్ ఇచ్చిందని మొదట్లోనే అర్థమైపోయింది. ఇప్పుడు ఆయనకు విజయవాడ పశ్చిమ టిక్కెట్ ఖరారు చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే కర్నూలు ఎంపీ స్థానాన్ని కూడా మార్చబోతున్నారు. టీడీపీ లో ఉన్న కేఈ ప్రభాకర్ కు కండువా కప్పి టిక్కెట్ ఖరారు చేయబోతున్నారు. ప్రస్తుతం కర్నూలు మేయర్ బీవై రామయ్యను అభ్యర్థిగా ఖరారు చేశారు.

ఆయనకు ప్రతీ సారి ఇలాగే హ్యండిస్తున్నారు. ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్న సమయంలోనూ అదే పని చేస్తున్నారు. కేఈ కృష్ణమూర్తి కుమారుడు ఇప్పటికే డోన్ నుంచి పోటీ చేస్తున్నారు. కేఈ ప్రభాకర్ కు సీటు నిరాకరించడంతో ఆయన సైలెంట్ గా ఉన్నారు. కానీ వైసీపీ పిలిచి మరీ ఆఫర్ ఇస్తోంది. ఇప్పటికే గుంటూరు ఎంపీ స్థానంలో పోటీకి రోశయ్య విముఖంగా ఉన్నారు. ఆ సీటు మార్చాల్సిందే. ఇక పి.గన్నవరం నియోజకవర్గంలోనూ పాత వైసీపీ లీడర్ పాముల రాజేశ్వరి దేవిని చేర్చుకున్నారు. ఆమెకూ టిక్కెట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

మైలవరంతో పాటు కనీసం పది స్థానాల్లో కొత్త నేతలకు టిక్కెట్లు ఇవ్వనున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పు చేర్పుల కారణంగా మరింత గందరగోళం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close