టిల్లు క్యూబ్‌.. ఈసారి ఇంకాస్త పెద్ద స్టార్!

డీజే టిల్లు రిలీజ్‌కు ముందు ఆ సినిమాపై ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు. కానీ అనూహ్య‌మైన విజ‌యాన్ని అందుకొంది. దానికి రెట్టింపు లాభాలు ‘టిల్లు స్క్వేర్‌’తో రాబ‌ట్టారు. ఇప్పుడు ‘టిల్లు క్యూబ్’ కూడా రాబోతోంది. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ అందుకు త‌గిన క‌థ‌ని రెడీ చేసుకోవంలో బిజీగా ఉన్నాడు. సిద్దు ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రంలో న‌టిస్తున్నాడు. ‘జాక్‌’ అనే పేరు పెట్టారు. ఇది పూర్త‌యిన త‌ర‌వాతే ‘టిల్లు క్యూబ్‌’ ప‌ట్టాలెక్కుతుంది.

‘టిల్లు’లో నేహా శెట్టి క‌థానాయిక‌గా న‌టించింది. అప్ప‌టికి ఆమెకు ఎలాంటి క్రేజ్ లేదు. ‘టిల్లు’ రిలీజ్ అయ్యాక త‌ను కూడా పాపుల‌ర్ అయిపోయింది. ‘టిల్లు స్క్వేర్‌’లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వ‌చ్చి చేరింది. క్యూబ్ లో ఓ స్టార్ హీరోయిన్‌ని రంగంలోకి దింపే ప్ర‌య‌త్నాల్లో ఉంది చిత్ర‌బృందం. త‌మ‌న్నా, స‌మంత‌.. ఇలా కొంత‌మంది పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. టిల్లు స్క్వేర్‌లో అనుప‌మ‌తో పాటుగా నేహా ఎలా క‌నిపించిందో, టిల్లు క్యూబ్‌లో ఆ స్టార్ హీరోయిన్‌తో పాటుగా నేహా, అనుప‌మ ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నారు. బ‌డ్జెట్ విష‌యంలోనూ టిల్లు క్యూబ్ వెసులుబాటు దొరికింది. ఈసారి టిల్లు గాడి హంగామా.. ఫారెన్‌లో ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close