భోళాశంక‌ర్ రిలీజ్ డౌట్‌.. ఇదిగో క్లారిటీ!

వాల్తేరు వీర‌య్య‌తో ఓ సూప‌ర్ హిట్టు కొట్టి ఫామ్‌లోకి వ‌చ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు అంద‌రి దృష్టీ.. భోళాశంక‌ర్‌పైనే. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. త‌మన్నా క‌థానాయిక‌. చిరుకి సోద‌రిగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్త‌య్యింది. ఆగ‌స్టు 11న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించింది. అయితే.. ఈ సినిమా అప్ప‌టికి రెడీ అయినా, విడుద‌ల మాత్రం డౌటే అని వార్త‌లొచ్చాయి. ఇప్పుడు భోళా శంక‌ర్ నుంచి ఓ క్లారిటీ వ‌చ్చేసింది. మే డే సంద‌ర్భంగా భోళాశంక‌ర్ కొత్త పోస్ట‌ర్లు విడుల‌ద‌య్యాయి. ఈ పోస్ట‌ర్ల‌పై మ‌రోసారి ఆగ‌స్టు 11నే రిలీజ్ డేట్ క‌నిపించింది. సో.. ఆగ‌స్టు 11న ఈ సినిమా రావ‌డం ప‌క్కా అయిన‌ట్టే.

నిజానికి ఆగ‌స్టు 11 చాలా మంచి డేట్. ఆగ‌స్టు 15న సెల‌వు క‌లిసొస్తుంది. అంటే.. భోళాకి లాంగ్ వీకెండ్ ద‌క్కుతుంద‌న్న మాట‌. ఇంత మంచి రిలీజ్ డేట్ ని ఎవ‌రు వ‌దులుకొంటారు? పైగా సినిమా దాదాపుగా అయిపోవొచ్చింది. ఆగ‌స్టు దాటితే.. ద‌స‌రా వ‌ర‌కూ మంచి రిలీజ్ డేట్ దొర‌క‌దు. అప్ప‌టి వ‌ర‌కూ సినిమాని ఎందుకు ఆపాలి? అందుకే ఆరు నూరైనా.. ఆగ‌స్టు 11నే భోళాని దింపాల‌ని చిరు ఫిక్స‌య్యాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close