మంత్రులకు హైకమాండ్ వార్నింగ్… ఓడితే వేటు తప్పదా..?

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. నియోజకవర్గ ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రచారంలో దూకుడు పెంచేలా ప్లాన్ చేస్తోంది. అయినా కొంతమంది నియోజకవర్గ బాధ్యులు ఈ ఎన్నికలను లైట్ తీసుకున్నారని తెలియడంతో వారిపై హైకమాండ్ పెద్దలు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఫలితాలు ఏమాత్రం తేడా వచ్చినా పదవులకు ఎసరు తప్పదని వార్నింగ్ ఇచ్చినట్లుగా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

లోక్ సభ ఎన్నికల ప్రచార తీరుతెన్నులపై కేసీ వేణుగోపాల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో ఇటీవల జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రచారంలో అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని కొంతమందిపై వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారిలో కదలిక మొదలైనట్లుగా తెలుస్తోంది. ప్రచారానికి మరో రెండు రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఎంపీ అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇంచార్జ్ లుగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిస్తే పదవులు దక్కుతాయి.. ఓడితే మాత్రం మంత్రులపై వేటు పడుతుందని అధిష్టానం వార్నింగ్ ఇవ్వడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు వారే అయినట్లుగా ప్రచారంలో వేగం పెంచారు.

ఏయే అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది..? ఎక్కడ పార్టీ వెనకబడి ఉంది..? అక్కడ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి..? అని అభ్యర్థులతో మంత్రులు, ఎమ్మెల్యేలు సమాలోచనలు జరుపుతున్నారని టాక్. పైగా ఈ నెల 10, 11 న రాహుల్ , ప్రియాంక గాంధీలు రాష్ట్ర పర్యటనకు వస్తోన్న నేపథ్యంలో సభలు, రోడ్ షో లను సక్సెస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అసలే పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో జోష్ మీద ఉండగా.. ఈ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం తేడా వచ్చిన పదవులకు ఎసరు వస్తుందనే హెచ్చరికలతో రెండు రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపు అనేదే లేదా ? ఆఫీసర్లకు పేర్ని నాని హెచ్చరిక

వైసీపీ నేతల ఆర్తనాదాలు పీక్స్ కు చేరుతున్నాయి. ఎంతగా అంటే.. చివరికి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. ఏ ఒక్కరినీ వదలం.. రేపు అనేది లేదనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఎవరిపైన అంటే.....

ఏబీవీకి పోస్టింగ్ – తెర వెనుక చాలా జరిగింది !

ఏబీవీకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. కానీ రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది. తెల్ల వారే సరికి ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం, పోస్టింగ్ ఇవ్వడం , రిటైర్మెంట్...

సజ్జలపై క్రిమినల్ కేసు… పోలీసులకు ఆ ధైర్యం ఎక్కడిది..?

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అలా ఫిర్యాదు అందిందో లేదో, ఇలా కేసు నమోదు కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐదేళ్లుగా వ్యవస్థలన్నింటిని కనుసైగలతో శాసించిన సజ్జలపై కేసు. అదీ క్రిమినల్ కేసు...

సినిమా థియేట‌ర్ల‌లో ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్

అవును... మీరు చ‌దివింది నిజ‌మే. మూవీ థియేట‌ర్ల‌లో ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్ టెలికాస్ట్ చేయ‌బోతున్నారు. దేశ‌వ్యాప్తంగా ఎవ‌రు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మోడీ ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారం చేప‌డ‌తారా..?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close