40 వేలు … దేశంలో కంట్రోల్ కాని వైరస్ ..!

మొన్నటి వరకూ.. పదిహేను వందలకు అటూ ఇటుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యేవి ఇప్పుడు.. రెండు వేలకు చేరుకున్నాయి. మెల్లగా 2500 దిశగా వెళ్తున్నాయి. ఏ రోజు కూడా.. కేసులు తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏ రోజుకారోజు .. కొత్త రికార్డు నమోదవుతోంది. ఆదివారం ఒక్క రోజే.. దేశంలో 2,487 కొత్త కేసులు నమోదయ్యాయి. గతంలో ఇన్ని కేసులు ఒకే రోజు ఎప్పుడూ నమోదు కాలేదు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య40వేలు దాటిపోయింది. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం ఒక్క రోజే 83 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఇది కూడా ఒకే రోజులో రికార్డు.

నిజానికి నలభై రోజుల లాక్ డౌన్ తర్వాత పరిస్థితి అదుపులోకి రావాల్సి ఉంటుంది. వైరస్ వ్యాప్తి కాలం 14 రోజులు.. కాదంటే.. 28 రోజులు. ఈ లెక్క ప్రకారం.. చూస్తే.. వైరస్ పూర్తిగా కంట్రోల్ కావాల్సి ఉంది. కానీ 40 రోజులు గడిచినా.. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి.కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఏపీ వంటి రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇతర చోట్ల కాస్త నిలకడగానే పరిస్థితి ఉంది. పరిస్థితి అంత ఆందోళనకరంగా లేదని కేంద్రం కొన్ని లెక్కలు చెబుతోంది. దేశంలో పాజిటివ్ కేసులు పదివేల నుంచి 20 వేలకు చేరడానికి 9 రోజులు పడితే .. 20 వేల నుంచి 40 వేలకు చేరడానికి 11 రోజులు పట్టిందని..ఆశావహ దృక్పధాన్ని చెబుతోంది.కానీ కాస్త విశ్లేషిస్తే.. 11 రోజుల్లోనే 20వేలకేసులు నమోదయ్యాయని అర్థం చేసుకోవచ్చు.

దేశంలో కరోనాను అత్యంత సమర్థగా డీల్ చేసిన రాష్ట్రాల్లో కేరళ అగ్ర స్థానంలో నిలిచింది. మొదట్లో.. కరోనా పాజిటివ్ కేసుల్లో మొదట్లో ఉండే ఆ రాష్ట్రం తర్వాత పూర్తిగా కంట్రోల్ చేసింది.ఇప్పటికి కరెక్ట్‌గా 500 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. వారిలో నాలుగు వందల మందికి తగ్గిపోయింది. డిశార్జ్ అయ్యారు. నాలుగు మరణాలు సంభవించాయి. ప్రస్తుతానికి అక్కడ యాక్టివ్ కేసులు 96 మాత్రమే. గోవా, మణిపుర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లు వైరస్‌ రహిత రాష్ట్రాలుగా మారాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫైనల్ లెక్క : పోస్టల్ బ్యాలెట్లు 5 లక్షల 40 వేలు !

పోస్టల్ బ్యాలెట్ల ఫైనల్ లెక్క తేలింది. మొత్తం జిల్లాల వారీగా వచ్చిన లెక్కలను చూస్తే 5,39,189 ఓట్లుగా గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ల గడువు పూర్తియన తర్వాత చెప్పిన దాని కంటే దాదాపుగా...

శ‌ర్వానంద్.. అంత టైమ్ లేద‌మ్మా!!

శ‌ర్వానంద్ కొత్త సినిమా 'మ‌న‌మే' రిలీజ్ డేట్ ఖాయ‌మైంది. జూన్ 7న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అంటే మ‌రో 15 రోజుల టైమ్ ఉంద‌న్న‌మాట‌. నిజానికి ఓ...

ఎక్స్‌క్లూజీవ్‌: ‘ఫిదా’ కాంబో మ‌ళ్లీ!

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా 'ఫిదా'. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ గా నిలిచిపోయింది. ఇప్పుడు వ‌రుణ్‌తేజ్‌, శేఖ‌ర్ క‌మ్ముల మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు. ఏ...

అసెంబ్లీకి డుమ్మా…కేసీఆర్ దారిలోనే జగన్ రెడ్డి..?

ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోతే జగన్ పరిస్థితి ఏంటి..? అధికారం కోల్పోవడాన్ని అవమానంగా ఫీలయ్యే జగన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా..? లేక కేసీఆర్ తరహాలోనే డుమ్మా కొడుతారా..? ఇప్పుడిదే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close