మహా న్యూస్ చానల్ మీద దాడులు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు … ఇక అందరిపై దాడులు చేస్తామని సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగుతున్నారు. లిస్టు రాసుకున్నామంటున్నారు. కొంత మంది బీఆర్ఎస్ నేతలు కూడా అవే పోస్టులు పెడుతున్నారు. కొడతాం.. దాడులు చేస్తాం అని బహిరంగ హెచ్చరికలు చేస్తున్నారు. వీరి తీరుతో ఎవరైనా భయపడతారో లేదో కానీ వారి రాజకీయం మాత్రం దారి తప్పిందని క్లియర్ గా అర్థమవుతుంది.
ప్రజాస్వామ్యంలో దారి తప్పితే శంకరగిరి మాన్యాలకే!
ప్రజాస్వామ్యంలో దాడులు ఏ విధంగానూ సమర్థనీయం కావు. సామాన్య ప్రజలు ఇలాంటి దాడులకు ఏ విధంగానూ సపోర్టు చేయరు. కానీ తమకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న వారిని అణిచివేసేందుకు రాజకీయ పార్టీలు ఈ దాడుల వ్యూహాన్ని అమలు చేస్తాయి. మొదట భయపెడతాయి.. తర్వాత దాడి చేస్తారు.కానీ దాని వల్ల తమకు జరిగే నష్టంపై అవగాహన ఉన్న పార్టీల అధినేతలు మాత్రం.. అదుపు చేస్తారు. వారే దారి తప్పిదే.. మహా న్యూస్ పై జరిగిన దాడి వంటి వ్యవహారాలు జరుగుతాయి. ఈ దాడి కేటీఆర్కు తెలియకుండా జరిగిందని ఎవరూ అనుకోరు. కేటీఆర్ మనస్థత్వం అలాగే ఉంటుంది. దాడులు చేస్తే భయపడిపోతారని ఆయన అనుకుంటున్నారు. కానీ దాడులు చేస్తే.. దావాలనం అంటించుకున్నట్లే అవుతుంది. అది కూడా సొంత పార్టీకి.
ఎలాంటి వ్యూహాలైనా ప్రజాస్వామ్య పద్దతిలోనే ఉండాలి !
బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉంది. ఆ పార్టీ ఎన్ని చేసిందో అందరూ చూశారు. ఎవరూ మర్చిపోలేదు. ఎవరిపై ఎలాంటి ప్రచారాలు చేయించారో.. ఎన్ని మీడియా చానళ్లను బ్యాన్ చేయించారో.. ఎంత మంది జర్నలిస్టుల్ని అరెస్టులు చేయించారో ప్రజలకు తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఏదో ప్రచారం చేశారని ఎటాక్ చేస్తే..గతంలో మీరు చేసిందేమిటన్న ప్రశ్న వారి వద్ద నుంచి వస్తుంది. ఎందుకంటే.. ప్రజలు ఇంకా అన్నీ మర్చిపోలేదు. అదే సమయంలో దాడులు అనే కాన్సెప్ట్ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రజలు హర్షించరు.
దాడులకు గురైన వారు భయపడరు.. మరింత రెచ్చిపోతారు !
మహా న్యూస్ పై దాడి చేయడం ద్వారా.. తాము తనపై జరిగే వ్యతిరేక ప్రచారాన్ని కంట్రోల్ అయిపోతుందని బీఆర్ఎస్ నేతలు అనుకుంటే అంత కంటే పొరపాటు ఉండదు. ఇంకా ఘాటు పెంచుతారు. ఎందుకంటే.. దాడికి గురవడం వల్ల మహా న్యూస్ కు ఎలాంటి నష్టం జరగకపోగా.. మరింత క్రేజ్ వస్తుంది. యూట్యూబ్ చానల్ కు ఎక్కువ అనుకున్న పొజిషన్ నుంచి ఆ చానల్ ను మరింత పెంచుతున్నారు. గతంలో దాడులను నమ్ముకున్న రాజకీయ పార్టీలు కాలగర్భంలో కలసిపోయాయి. ఇప్పుడు అదే దారిలో బీఆర్ఎస్ వెళ్తోంది. రాజకీయాలు ఎప్పుడైనా ప్రజలు ఏమనుకుంటారు అన్న కోణంలోనే ఆలోచించి చేయాలి. లేకపోతే.. ముందు ముందు కూడా డిపాజిట్లు దక్కకపోవచ్చు.