భ‌లేభ‌లే మ‌హానుభావుడోయ్‌ మారుతి !

భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు.. ఈ రెండు సినిమాలూ మారుతి కెరీర్‌ని మ‌లుపుతిప్పాయి. పెద్ద హీరోల దృష్టి మారుతిపై ప‌డేలా చేశాయి. రెండూ డిజార్డ‌ర్‌కి సంబంధించిన క‌థ‌లే. భ‌లే భ‌లే మగాడివోయ్ లో హీరోకి మ‌తిమ‌రుపు. మ‌హానుభావుడులో మాత్రం అతి శుభ్ర‌త‌. చిన్న కాన్సెప్టుల‌న్ని ప‌ట్టుకుని, దాని చుట్టూ వినోదాత్మ‌క క‌థ‌లు అల్లి సూప‌ర్ హిట్లు కొట్టాడు మారుతి. భ‌లే భ‌లే మగాడివోయ్ కి సీక్వెల్ తీస్తార‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. నాని కూడా మారుతితో ఈ సినిమా చేయ‌డానికి రెడీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మారుతి ఆలోచ‌న మారింది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు రెండు సినిమాల్నీ క‌లిపి – ఓ క‌థ రాయ‌బోతున్నాడ‌ట‌. అంటే ఈ క‌థ‌లో.. మ‌తిమ‌రుపు, అతి శుభ్ర‌త రెండు ల‌క్ష‌ణాలూ క‌నిపిస్తాయి.

“భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు ఈ రెండు సినిమాల్లోని హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ని క‌లుపుకుంటే మ‌రొ గ‌మ్మ‌త్తైన క‌థ పుడుతుంద‌ని అనిపిస్తోంది. ఇంకా ఈ ఆలోచ‌న ప్రాధ‌మిక ద‌శ‌లోనే ఉంది. అయితే నా రాబోయే సినిమా పూర్తి వినోదాత్మ‌క‌మైన‌ది. క‌థ‌లో హీరోకి ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లూ ఉండ‌వు. ఆరోగ్య‌క‌ర‌మైన హాస్యం త‌ప్ప‌” అని క్లారిటీ ఇచ్చారు మారుతి. రెండు సినిమాల్ని క‌లిపి సీక్వెల్ చేసే ఆలోచ‌న కొత్త‌దే. అందులో ఇద్ద‌రు హీరోలు (నాని, శ‌ర్వానంద్‌) న‌టిస్తే ఇంకా కొత్త‌గా ఉంటుంది. మారుతి ప్లాన్ కూడా అదే కావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close