ప‌ర‌శురామ్ గురి.. బాల‌య్య‌పై!

గీత గోవిందంతో సూప‌ర్ డూప‌ర్ హిట్టు కొట్టాడు ప‌ర‌శురామ్. ఆ త‌ర‌వాత‌… మ‌హేష్ బాబుతో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింది. అలా.. స‌ర్కారు వారి పాట తీశాడు. ఆ సినిమా హిట్టుకీ, యావ‌రేజ్‌కీ మ‌ధ్య ఊగిస‌లాడింది. అప్ప‌టి నుంచీ ప‌ర‌శురామ్ ఖాళీగానే ఉన్నాడు. మ‌ధ్య‌లో నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా చేయాలి. కానీ కుద‌ర్లేదు. ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర క‌థ ఉంది కానీ, హీరో లేడు. టాలీవుడ్ లో పెద్ద హీరోలంతా బిజీగా ఉన్న నేప‌థ్యంలో ప‌ర‌శురామ్ కి బాగా గ్యాప్ వ‌చ్చేసింది. ఇప్పుడు ప‌ర‌శురామ్ దృష్టి.. బాల‌కృష్ణ‌పై ప‌డింది. గీతా ఆర్ట్స్ ద‌గ్గ‌ర ప‌ర‌శురామ్ ఇది వ‌ర‌కే అడ్వాన్స్ తీసుకొన్నాడు. ఆ సంస్థ‌లో ఓ సినిమా చేయాలి. ఇప్పుడు గీతా ఆర్ట్స్ లో బాల‌య్య కూడా ఓ భాగ‌మైపోయాడు. అందుకే ఎలాగోలా.. బాల‌య్య‌ని ఒప్పించి, గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేయాల‌ని ప‌ర‌శురామ్ భావిస్తున్నాడు.

అల్లు శిరీష్ న‌టించిన ఊర్వ‌శివో – రాక్ష‌సివో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ వేడుక‌కు ప‌ర‌శురామ్ కూడా వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య‌ని ఉద్దేశించి ప‌ర‌శురామ్ మాట్లాడుతూ ”సార్ .. త్వ‌ర‌లోనే ఓ క‌థ‌తో మిమ్మ‌ల్ని క‌లుస్తా… ఈ విష‌యం అల్లు అర‌వింద్ గారికి కూడా తెలుసు…” అని హింట్ ఇచ్చేశాడు ప‌ర‌శురామ్. బాల‌య్య ఓపెన్ మైండ్‌తో ఉంటాడు. ఎవ‌రు క‌థ చెబుతాన‌న్నా… విన‌డానికి రెడీనే. పైగా గీతా ఆర్ట్స్ కూడా బాల‌య్య‌తో ఓ సినిమా చేయాల‌ని చూస్తోంది. ప‌ర‌శురామ్ క‌థ ఓకే అయితే గ‌నుక‌.. ఈ కాంబో సెట్ట‌యిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close