యోగా శిక్షణలో పాల్గొననందుకు ఐ.ఐ.టి. విద్యార్ధులపై క్రమశిక్షణ చర్యలు!

మోడీ ప్రభుత్వం తన అభిప్రాయాలని, ఆలోచనలని, హిందూ భావజాలాన్ని బలవంతంగా దేశప్రజల మీద రుద్దుతుందనే అపవాదు, విమర్శలు చాలా మూటగట్టుకొంది. అటువంటి ప్రయత్నాల వలన అది చేస్తున్న మంచిపనులు, సంస్కరణలు అన్నీ తుడిచిపెట్టుకుపోయి చెడ్డపేరు సంపాదించుకొంటోంది. బిహార్ శాసనసభ ఎన్నికలలో భాజపా ఓడిపోవడానికి ‘మత అసహనం’ కూడా ఒక కారణమని అందరికీ తెలుసు. తన అభిప్రాయాలని బలవంతంగా ప్రజల మీద రుద్దాలని చూస్తే దాని వలన ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని అనుభవపూర్వకంగా తెలుసుకొన్నప్పటికీ మోడీ ప్రభుత్వ తీరులో మార్పు కలుగకపోవడం విచిత్రమే.

ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 18 నుండి 24 వరకు దేశవ్యాప్తంగా యోగాభ్యాస శిక్షణా కార్యక్రమాలు జరిగాయి. దానిలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. వాటిలో ఐ.ఐ.టి. రూర్కెలా కూడా ఒకటి. ఒక మంచి పనిలో అందరూ భాగస్వాములు అవడం చాలా గొప్ప విషయమే. కానీ వారం రోజులు పాటు సాగిన ఆ యోగా శిక్షణా కార్యక్రమాలకి హాజరుకాని ఐ.ఐ.టి. రూర్కెలా విద్యార్ధులపై ఆ సంస్థ అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్దం అవుతుండటమే ఎవరూ హర్షించలేరు.

ఆ కార్యక్రమానికి హాజరుకాని విద్యార్ధుల జాబితాలను తయారుచేసే పనిలో పడ్డారు ఆ సంస్థ అధికారులు. దీనిపై విద్యార్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువులు, పరీక్షలు కారణంగా క్షణం తీరిక లేకుండా ఉండే తమని ఇటువంటి కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలని లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామని బెదిరించడం సరికాదని అంటున్నారు.

ఇదే విషయంపై ఐ.ఐ.టి. రూర్కెలా డీన్ డి.కె.నౌరియాల్ ని మీడియా ప్రశ్నించగా, “యోగా శిక్షణా కార్యక్రమాలకి ఎంతమంది హాజరయ్యారో, మిగిలిన వారు ఎందుకు హాజరు కాలేదో అని తెలుసుకోవడానికి మాత్రమే మేము విద్యార్ధుల హాజరు వివరాలని సేకరిస్తున్నాము. అది కేవలం రికార్డు కోసమే తప్ప విద్యార్ధులపై క్రమశిక్షణ చర్యల కోసం కాదు. యోగా శిక్షణా కార్యక్రమానికి హాజరు కమ్మని మేము ఎవరినీ ఒత్తిడి చేయలేదు. చేయబోము,” అని చెప్పారు.

ఆయన చెపుతున్నదే నిజమనుకొంటే, మళ్ళీ యోగా తరగతులకి విద్యార్ధులు ఎందుకు రాలేదో కారణాలు తెలుసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అంటే విద్యార్ధులు చెపుతున్నది నిజమేనని అర్ధం అవుతోంది. యోగా తరగతులకి హాజరు కాని విద్యార్ధులపై, 60 శాతం కంటే తక్కువ హాజరున్న విద్యార్ధులపై కూడా జరిమానా విధించడం లేదా వారి మార్కులలో కోత విధించబోతున్నట్లు విద్యార్ధులే చెపుతున్నారు. అధికారులు ప్రదర్శించే ఇటువంటి అత్యుత్సాహం వలనే మోడీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. చెడ్డపేరు వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టాలీవుడ్ మార్కెట్ పెంచుకుంటున్న కన్నడ స్టార్

ఈ మధ్య భాషా బేధాలు లేకుండా అన్ని భాషలకి చెందిన సూపర్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్...

కేసీఆర్ కు ఏమైంది..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు...

బొత్స తండ్రి సమానుడా ? : షర్మిల

వైఎస్ జగన్ బొత్సను తన తండ్రి సమానుడు అని అనడం.. ఆయన విచిత్రమైన హావభావాలతో కంట తడిపెట్టుకున్నట్లుగా నటించడం, తర్వాత కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం విజయనగరం సిద్ధం సభలో కనిపించిన...

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close