ఈటలను పట్టించుకోని బండి సంజయ్ !

ఈటల రాజేందర్ కు బీజేపీలో నిరాదరణే ఎదురవుతోంది. ఆయన గెలిస్తే తమకు ఎక్కడ అడ్డు వస్తారో అని అనుకుంటున్నారేమో కానీ ఆయన గురించి పట్టించుకోవడం మానేశారు. నామినేషన్ వేసినప్పుడు కనిపించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు మళ్లీ కనిపించలేదు. తర్వాత నవరాత్రి దీక్ష చేసిన బండి సంజయ్ ఇంటి నుంచి కదల్లేదు. ఇప్పుడు ఆయన ఢిల్లీ పయనమయ్యారు. మరో వైపు ఈటల కు పార్టీ పరంగా సహకారం లభించకపోవడంతో అన్నీ ఆయన ఒక్కడే చేసుకుంటున్నారు.

ప్రచారం కోసం హైకమాండ్ ముఖ్య నేతలు ఎవరైనా వస్తారో లేదో క్లారిటీ లేదు. తెలంగాణ పార్టీ తరపున ఇంచార్జులుగా ప్రకటించిన వారు పండుగ పేరుతో నియోజకవర్గాన్ని వీడారు. మళ్లీ ఎప్పటికి వస్తారో స్పష్టత లేదు. ఉపఎన్నిక వస్తుందని తెలిసినా బండి సంజయ్ పాదయాత్ర చేశారు. కానీ హుజురాబాద్‌పై పెట్టిన దృష్టి మాత్రం కొంతే. అక్కడ ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. ప్రచార గడువు పట్టుమని పది రోజులు కూడా లేదు. ఈ సమయంలో ప్రచారం జోరు పెంచాల్సింది పోయి బండి సంజయ్ కూడా ఢిల్లీ వెళ్లడం ఈటల వర్గీయుల్ని నిరాశ పరుస్తోంది.

బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొనేందుకు జాతీయ నేతలు తరలి వచ్చారు. కానీ ఈటల విషయంలో మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఈటల ఒంటరి పోరాటం చేస్తున్నారన్న భావన పెరిగిపోతోంది. ఇవన్నీ పట్టించుకుంటే కష్టమని..తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు ఈటల.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close