“కొత్త జిల్లాల పని” చేస్తామంటున్న ఉద్యోగ సంఘాలు !

ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాలు భిన్నంగా స్పందించాయి. ఐఏఎస్‌లు మినహా ఉద్యోగలంతా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే సమ్మెలోకి వెళ్లేలోపు ఉద్యోగులందరూ తమ విధులు తాము నిర్వహిస్తాని.. కొత్త జిల్లా ప్రక్రియకు శక్తివంచన లేకుండా సాయం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.

సమ్మెలోకి వెళ్లనంత వరకూ ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం రాదన్నారు. అయితే పనిచేయాల్సిందేనని ఉద్యోగులపై అధికారులు ఒత్తిడి తేవొద్దని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. ఈ నెల జీతాలు రాకుండా ఉండేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. జీతాలు రాకుంటే ఉద్యోగులు తిరగబడతారని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఉద్యోగులకు జీతాలు రాకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలని బొప్పరాజు మండిపడ్డారు. జిల్లాల ఏర్పాటు ఓ సుదీర్ఘమైన ప్రక్రియ. ఉద్యోగులు లేకుండా పని జరగదు.

సమ్మెకు వెళ్తున్నారని తెలిసి కూడా ప్రభుత్వం ఈ ప్రక్రియను తెర ముందుకు తెచ్చింది. ఇప్పుడు ఉద్యోగులు డిమాండ్ల మేరకు కనీసం జీవో వెనక్కి తీసుకోకపోతే.. వారు సమ్మెకు వెళ్లడం ఖాయమే. అదే జరిగితే జిల్లాల ప్రక్రియ ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం … జిల్లాల ప్రక్రియపై ఎందుకు దూకుడు ప్రదర్శిస్తుందో చాలా మందికి అర్థం కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close