సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్సే..!

గ్రేటర్ ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం బోల్తా కొట్టాయి. ఒక్కటంటే.. ఒక్క సంస్థ కూడా సరిగ్గా ఫలితాలను అంచనా వేయలేకపోయింది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వేవ్ ను అంచనా వేయలేకపోయాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే… ఆరా నుంచి పీపుల్స్ పల్స్ అంటూ..అనేక ఊరూపేరూ లేని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అన్నింటిలోనూ టీఆర్ఎస్‌కే అగ్ర తాంబూలం ఇచ్చారు. కొన్ని సర్వేలు అయితే… కేటీఆర్, కేసీఆర్ ఎక్కడ ఇబ్బంది పడతారోనన్నట్లుగా ఏకంగా 101 సీట్లు కూడా ఇచ్చాయి.

కానీ చివరికి ప్రజాభిప్రాయాన్ని ఎవరూ అంచనా వేయలేకపోయారు. హోరాహోరీగా సాగిన ఫలితాల్లో…టీఆర్ఎస్ నాలుగైదు సీట్లు ఎక్కువ తెచ్చుకున్నా… ఘోరపరాజయం కిందనే లెక్క తేలుతోంది. ఇంత దారుణమైన ఫలితాల్ని ఏ సర్వే సంస్థ అంచనా వేయలేదు. తెలంగాణలో ఉన్న సర్వే సంస్థలన్నీ ఏ మాత్రం వనరులు లేని.. సింగిల్ షట్టర్‌లో ఉండే సంస్థలే. ఆయా పార్టీల వద్ద డబ్బులు తీసుకుని వారికి తగ్గట్లుగా సర్వే ఫలితాలు ప్రకటించడంలో రాటుదేలిపోయాయి. ఇప్పుడు ఆ విషయం నిరూపితమయింది.

సర్వేల ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చవచ్చని కొన్ని పార్టీలు అనుకుంటూ ఉంటాయి. అలాంటి పార్టీలకు..ఈ కొత్త తరం పొలిటికల్ స్ట్రాటజిస్టులు.. స్రవే సంస్థల పేరుతో.. వల వేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని కావాల్సినట్లుగా సర్వేలు వేసిస్తున్నారు. ఇలాంటి వారందరికీ గడ్డు పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close