మంగళగిరిలో ఎయిమ్స్ శంఖుస్థాపనకి చురుకుగా ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సాస్ (ఎయిమ్స్)ను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మంగళగిరిలో ఉన్న టీబీ ఆసుపత్రికి చెందిన 193 ఎకరాలలో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించబోతున్నారు. ఈనెల 19న ఉదయం 11గంటలకు ఎయిమ్స్ ఆసుపత్రికి శంఖుస్థాపన జరుగబోతోంది. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఆ సందర్భంగా అక్కడ ఒక బారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. శంఖుస్థాపనకి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున అధికారులు ముమ్మురంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ శంఖుస్థాపన జరుగబోయే ప్రాంతాన్ని సందర్శించి శంఖుస్థాపన కార్యక్రమానికి అవసరమయిన ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చేరు. శంఖుస్థాపన చేయవలసిన ప్రదేశం, శిలా ఫలకం, పైలాన్, వేదిక వగైరా ఏర్పాటు చేయవలసిన ప్రదేశాలను గుర్తించి, వాటిని ఏర్పాటు చేయవలసిన బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ఎయిమ్స్ నిర్మాణానికి అవసరమయిన నిధులు మంజూరు చేయడానికి కేంద్రప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close