ముందస్తు బెయిలు కోసం మల్లాది విష్ణు పిటిషన్ దాఖలు

కల్తీ మద్యం కేసులో తొమ్మిదవ నిందితుడిగా పేర్కొనబడిన విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సుమారు వారం రోజులవుతున్నా ఇంతవరకు ఆయనని పోలీసులు పట్టుకోలేకపోయారు. కానీ ఆయన తరపున విజయవాడ నగర మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో మంగళవారం ముందస్తు బెయిలు కోరుతూ ఒక పిటిషన్ దాఖలవడం విశేషం. ఆయన తరపున ఆయన లాయర్ ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ఆ కేసును శుక్రవారానికి వాయిదా వేశారు.

ఈ కల్తీ మద్యం కేసు బయటపడినప్పుడు ఆ బార్ అండ్ రెస్టారెంట్ తో తనకు ఎటువంటి సంబంధమూ లేదని మల్లాది విష్ణు వాదించేరు. కానీ స్వయంగా ఆయన తల్లి బాలత్రిపుర సుందరే దాని లైసెన్స్ హోల్డర్స్ లో ఒకరని తేలింది. మల్లాది విష్ణు వంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు పోలీసులకు తక్షణమే లొంగిపోకుండా తప్పించుకొని తిరుగుతుండటం ఒక తప్పు. ఆయన తన లాయర్ ద్వారా కోర్టులో పిటిషన్ వేయగలుగుతున్నప్పటికీ ఇంతవరకు ఆయనని పోలీసులు కనుగొనలేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఆయనకు చెందిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ యొక్క లైసెన్స్ హోల్డర్స్ అయిన విష్ణు కుటుంబ సభ్యులు కూడా పోలీసుల విచారణకు హాజరుకాకపోవడం, కాకపోయినప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోకుండా మళ్ళీ నోటీసులు జారీ పేరిట ఇంకా ఉపేక్షించడం అనుమానాలకు తావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close