గోపీచంద్ సినిమాకి మోక్షం?

ఆర‌డుగుల బుల్లెట్‌.. ఈ సినిమా గుర్తుందా? గోపీచంద క‌థానాయ‌కుడిగా, బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా. కాంబినేష‌న్ కాస్త ఆర్డ్ గా ఉంది క‌దా? అందుక‌నేనేమో.. సినిమా కూడా అలానే త‌యారైంది. ఎన్నో ఆటంకాల మ‌ధ్య పూర్త‌యినా, ఇప్ప‌టి వ‌ర‌కూ విడుద‌ల‌కు నోచుకోలేదు. చాలాసార్లు విడుద‌ల తేదీ ప్ర‌క‌టించినా, వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈ సినిమా ఆర్థిక స‌మ‌స్య‌ల్లో ప‌డిపోవ‌డం వ‌ల్ల, కోర్టు గొడ‌వ‌ల వ‌ల్ల‌.. విడుద‌ల కాలేదు.

ఇన్నాళ్ల‌కు ఓటీటీ పుణ్య‌మా.. అని `ఆర‌డుగుల బుల్లెట్‌` దూసుకెళ్ల‌డానికి రెడీ అయ్యింది. ఈ సినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ముంద‌స్తుగా కోర్టు నుంచి క్లియ‌రెన్సులు తీసుకున్నార‌ని స‌మాచారం. ఈ సినిమా విడుద‌ల చేసుకోవ‌డానికి న్యాయ స్థానం అంగీక‌రించింద‌ని, అయితే లావాదేవీల‌న్నీ న్యాయ‌స్థానానికి ముంద‌స్తు స‌మాచారం ఇచ్చి చేసుకోవాల‌ని ఆదేశించింది. ఈ సినిమాపై అప్పు ఇచ్చిన‌వాళ్లంతా గ‌తంలో న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించి, సినిమా విడుద‌ల కాకుండా స్టే తీసుకొచ్చారు. ఎవ‌రికి అమ్ముకున్నా స‌రే, ఆ మొత్తాన్ని న్యాయ‌స్థానానికి చెల్లించి సినిమాని విడుద‌ల చేసుకోవాల‌ని కోర్టు సూచించింది. దాంతో ఈ సినిమా విడుద‌ల‌కు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టైంది. అమేజాన్ ప్రైమ్‌, జీ 5ల‌తో చిత్ర నిర్మాత చ‌ర్చ‌లు మొద‌లెట్టాడు. త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యానికి రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close