గుజరాత్ అల్లర్ల కేసు చివరికి చచ్చిపోయిన పటేల్ దగ్గరకు చేరింది !

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ప్రపంచవ్యాప్తంగా ఓ రకమైన ఇమేజ్ రావడానికి కారణం గుజరాత్ అల్లర్ల కేసులు. ఆయనపై వచ్చిన అభియోగాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవలే ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయనపై ఆరోపణలు చేసిన వారిని అరెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో సిట్ అసలు మోదీపై ఈ ఆరోపణలు ఎలా వచ్చాయో కనిపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అహ్మద్ పటేల్ మోదీని బ్యాడ్ చేయడానికి ఇలా కుట్ర చేశారని కనిపెట్టింది. ఈ విషయాన్ని కోర్టుకు అఫిడవిట్ రూపంలో చెప్పింది.

అప్పటి మోడీ సర్కార్‌ను బర్తరఫ్‌ చేసేందుకు అహ్మద్‌ పటేల్‌ ఆదేశాల మేరకు తీస్తా సెతల్వాద్, మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌, ఐపీఎస్ ఆఫీస‌ర్ సంజీవ్ భ‌ట్‌ల‌ు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారన్నారు. వీరికి అహ్మద్ పటేల్ ముఫ్ఫై లక్షలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ నుంచి అక్ర‌మంగా డ‌బ్బు తీసుకునేందుకు తీస్తా, శ్రీకుమార్‌లు కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు సిట్ అఫిడివిట్‌లో పేర్కొంది. తీస్తా సెతల్వాద్‌ను ..మాజీ ఐపీఎస్ సంజీవ్ భ‌ట్‌ను అహ్మ‌దాబాద్ క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్టు చేశారు.

అయితే 2020లో అహ్మ‌ద్ ప‌టేల్ చనిపోయారు. సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఆయన సుదీర్ఘ కాలం ఉన్నారు. అయితే చనిపోయిన ఆయన ఎలాంటి వాదనలు వినిపించుకోలేరు . ఆయన బతికి ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలుచేయలేదు. కానీ ఇప్పుడు ఆయన చనిపోయిన సిట్ అహ్మద్ పటేల్‌ను ప్రధాన నిందితుడ్ని చేసింది. గుజరాత్ ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో సిట్ నివేదిక గుజరాత్‌లో హాట్ టాపిక్‌యింది. చనిపోయిన వారినీ వదలరా అని కాంగ్రెస్ పార్టీ ఈసడించుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close