ఈఎస్ఐ స్కాం నిందితుడి నుంచి మంత్రి కుమారుడికి కారు గిఫ్ట్..!

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే స్వగ్రామంలో అంతర్రాష్ట్ర పేకాట క్లబ్.. దాంతో పాటు భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తాజాగా.. ఈఎస్‌ఐ స్కాంలో నిందితుల నుంచి లంచం తీసుకున్నట్లుగా బలమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్ ఇటీవలి కాలంలో సరికొత్త బెంజ్ కారుతో తిరుగుతున్నారు. దాని విలువ రూ. కోటి రూపాయలు ఉంటుంది. అయితే అది ఆయన కొనుగోలు చేసి ఉంటే సమస్య ఉండేది కాదు.. బహుశా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై చర్చలు పెట్టేవారు. కానీ ఆ కారు.. ఈఎస్‌ఐ స్కాంలో పధ్నాలుగో నిందితుడిగా ఉన్న కార్తీక్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. కానీ అది పేరుకే.. మొత్తం యజమానికి మాత్రం.. మంత్రి జయరాం కుమారుడే.

షోరూమ్‌లో వాహనం తీసుకోవడం దగ్గర్నుంచి ఆ వాహనంతో అదే పనిగా తిరుగుతూ.. ఫోటో షూట్లు చేయించుకుంటూ.. సోషల్ మీడియాలో పెడుతూ.. ఆనందం పొందుతున్నారు. డెలవరీ తీసుకున్నది కూడా జయరాం కుమారుడే. అయితే.. ఇప్పుడు ఆ కారు ఓనర్ మాత్రం.. ఈఎస్‌ఐ స్కాంలో నిందితుడిది. మిగతా వారు.. రోజుల తరబడి జైల్లో ఉన్నా.. గుమ్మనూరు జయంరాం కుమారుడికి కారు ఇచ్చిన కార్తీక్ మాత్రం.. నాలుగైదు రోజుల్లోనే బెయిల్ తీసుకుని బయటకు వచ్చేశారు. ఓ మెడికల్ ఎజెన్సీ ఉన్న కార్తీక్ .. . కార్మిక మంత్రి అయిన గుమ్మనూరు జయరాం నుంచి లబ్ది పొందారనే ప్రచారం ఉద్ధృతంగా ప్రారంభమయింది.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ వ్యవహారంపై ప్రభుత్వం అవినీతిపై ఫిర్యాదుల కోసమంటూ ప్రారంభించిన కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి.. మొత్త వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అవినీతిపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని చెబుతోందని.. ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నానని అంటున్నారు. ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపిస్తామని అయ్యన్నపాత్రుడు సవాల్ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని ఇప్పుడు ఆధారాలు చూపిస్తున్నామని మంత్రి ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close