క్రైమ్ : గంజాయి కొట్టే అమ్మాయి రేప్ డ్రామా ఆడితే..!?

అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా దారి తప్పుతారు. కానీ దారి తప్పిన అమ్మాయిల విషయంలో నిజాలు చెప్పడానికి చాలా మంది భయపడతారు. కానీ అప్పుడప్పుడు కొన్ని సంఘటనల్లో నిజాలు బయట పెట్టక తప్పదు. ఇప్పుడు హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్‌లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో నిజానిజాలు బయటకు వచ్చేసరికి అందరూ ఔరా అని నోరు తెరవాల్సి వచ్చింది.

మూడు రోజుల కిందట.. రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఘట్‌కేసర్ వద్ద ఓ అమ్మాయి నగ్నంగా పడి ఉంది. తనపై సామూహిత అత్యాచారం జరిగిందని.. ఆటో డ్రైవర్లు చేశారని ఆమె తల్లికి చెప్పడంతో తల్లి.. పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆమెను అపస్మారక స్థితిలో పడి ఉండగా కనిపెట్టి.. ఆస్పత్రికి తరలించారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని విచారణ ప్రారంభించారు.

అమ్మాయి తల్లికి… ఆ అమ్మాయి తనను ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారని చెప్పింది. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేశారు. కానీఎక్కడా ఆటోడ్రైవర్ల ఆచూకీ కనిపించలేదు. కానీ ఓ మారుతీ వ్యాన్‌లో ఎక్కుతున్న దృశ్యాలు మాత్రం వెలుగులోకి వచ్చాయి. వాటిని బట్టి తీగ లాగారు. వారెవరూ ఆటోడ్రైవర్లు కాదని తేలింది. అంతే కాదు.. వారిలో ఒకరు ఆ అమ్మాయి ప్రియుడని.. మిగతా వారు.. అతని సోదరులని తేలింది. మొత్తంగా సాక్ష్యాలు వివరాలు.. అన్నీ సేకరించగా.. పోలీసులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అట్నుంచి అటు ఆస్పత్రికి వెళ్లి అమ్మాయిని కాస్త గట్టిగా ప్రశ్నిస్తే చెప్పాల్సింది మొత్తం చెప్పేసింది. దాంతో కేసు మిస్టరీ వీడిపోయింది.

అది సామూహిక అత్యాచారం కాదు. ఇష్టపూర్వకంగా జరిగింది. ఆ యువతికి గంజాయి అలవాటు ఉంది. ఆమెకు ఓ ప్రియడు ఉన్నాడు. అతను కూడా గంజాయి బానిస. ఘటన జరిగిన రోజు… ప్రియుడితో పాటు గంజాయి తాగడానికి రాత్రి పూట వెళ్లింది. ప్రియుడితో పాటు ఆమె సోదరులు వచ్చారు. ఆమె అంగీకారంతోనే ముగ్గురు ఆమెతో శృంగారంలో పాల్గొన్నారు. అయితే ఆమె తల్లి అదే పనిగా ఫోన్ చేస్తూండటంతో… తనపై ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారని కథ చెప్పింది. ఈ మొత్తాన్ని ఆమె అంగీకరించింది.

జరిగే ప్రతి నేర ఘటనలోనూ రెండు కోణాలు ఉంటాయి. అయితే ప్రతీ సారి ఒక్కటే హైలెట్ అవుతూ ఉంటుంది. కానీ.. ఈ సారి మాత్రం… కాస్త సందేహించాల్సి వచ్చినా నిజాన్ని బయట పెట్టడానికి పోలీసులు పెద్దగా ఆలోచించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close