వైసీపీ వాళ్లనే అలా చంపితే ఇక ఎవరికి గ్యారంటీ..?

కాకినాడలో వైసీపీకి చెందిన కార్పొరేటర్‌ను ప్రత్యర్థి చంపిన వైనం ఒళ్ల గగుర్పొడిచేలా ఉంది. చచ్చే వరకూ వదిలి పెట్టకుండా కారుతో తొక్కించి చంపేశారు. ఆ కార్పొరేటర్ వైసీపీలో కీలక నేత. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా పేరు పొందాడు. సెటిల్మెంట్ లు చేయడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉంది. అయితే.. ఆయన ఇప్పుడు అధికార పార్టీ. పైగా ద్వారంపూడి అనుచరుడు. అలాంటి గట్టి పొజిషన్‌లో ఉన్న కార్పొరేటర్‌నే నిర్భయంగా నడి రోడ్డుపై కావాలని తొక్కించి చంపేశారంటే… నేరస్తుల్లో చట్టాల పట్ల.. పోలీసుల పట్ల భయం పూర్తిగా పోయిందని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై చాలా కాలంగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే రాజకీయంగా టీడీపీ నేతలపై దాడులు చేస్తూంటే పోలీసులు ఊరుకున్నారు కానీ ఇతర అంశాల్లో సిన్సియర్‌ గా ఉన్నారని ప్రజలు సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే వైసీపీ నేతలు చే సే ప్రతీ అరాచకానికి టీడీపీ ముద్ర వేసి పని పూర్తి చేసుకుంటున్నారు. దీంతో ప్రజల్లో…పోలీసుల భయం కంటే… వైసీపీ నేతల భయమే ఎక్కువయింది.అయినప్పటికీ.. ఇటీవలి కాలంలో ఎలాంటి పరిస్థితులు మారలేదు. పట్టపగలు హత్యలు జరగడం కామన్ గా మారింది. ఇప్పుడు అది.. నడి రోడ్డుపై కారుతో తొక్కించి చంపే వరకూ వెళ్లింది.

నేర స్వభావం ఉన్న వారికి కొంచెం సందు ఇచ్చినా వారు చెలరేగిపోతారు. చట్టాలను చుట్టాలుగా మార్చుకుని .. అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తారు. అలాంటి పరిస్థితి ఒకప్పుడు బీహార్‌లో ఉండేది. ప్రజలు భయపడిపోయేవారు. అందుకే ఆ పరిస్థితిని జంగిల్ రాజ్‌గా చెప్పుకుంటూ ఉంటారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఓడిపోవడానికి మళ్లీ అధికారం అందుకోవడానికి తంటాలు పడుతూండటం ఆ జంగిల్ రాజే కారణం. ఇప్పుడు ఆ పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close